హైదరాబాద్: సోషల్ మీడియా తఢాకతో తెలంగాణ పోలీస్ బాస్యే జరిమానా కట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. ట్రాఫిక్ రూల్స్ అతిక్రమిస్తే ఎవరికైనా జరిమానా తప్పదని నిరూపితమైన సంఘటన ఇది.
వివరాల్లోకి వెళితే…ఈ నెల మూడవ తేదీన డిజిపికి చెందిన కారు సంగారెడ్డిలో రాంగ్ రూట్లో వెళుతుండగా ఎవరో సామాన్యుడు ఫోటో తీసి సోషల్ మీడియా ద్వారా పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ ఫోటో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయ్యింది. దీంతో కారు వివరాలను పోలీసులు ఆరా తీయగా అది తెలంగాణ డిజిపి ఎం మహేందర్ రెడ్డి పేరుతో ఉన్నట్లు గుర్తించారు. దీంతో ట్రాఫిక్ పోలీసులు నిబంధనల మేరకు 1,135లు జరిమానా విధించారు.