ముంబాయి: మహారాష్ట్రలో శివసేన రాజకీయ నేతల ఊహాగానాలకు భిన్నంగా అనూహ్య నిర్ణయం తీసుకున్నది. శాసనసభాపక్ష నేతగా ఏక్నాధ్ షిండేని ఎన్నుకున్నారు. శివసేన అధినేత ఉద్దవ్ ఠాక్రే కుమారుడు అదిత్య ఠాక్రేని ఎన్నుకోనున్నారని వార్తలు వెలువడుతున్న నేపథ్యంలో అనూహ్యంగా ఏక్నాధ్ షిండేను ఎన్నుకున్నారు. ఏక్నాధ్ షిండే పేరును అదిత్య ఠాక్రే ప్రతిపాదించగా సభ్యులంతా ఏకగ్రీవంగా ఆమోదం తెలిపారు. ఈ పదవిలో ఆదిత్యను కూర్చొబెట్టడానికి ఉద్దవ్ ఇష్టపడనట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.
మధ్యాహ్నం సభ్యులంతా గవర్నర్ను కలవనున్నారు. మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలు వెలువడి వారం గడుస్తున్నా ప్రభుత్వ ఏర్పాటుపై ఇంకా పీటముడి వీడలేదు. అధికారం చెరిసగం పంచుకోవాలని శివసేన వాదిస్తుండగా బిజెపి అందుకు అంగీకరించడం లేదు.