అమరావతి: వచ్చే విద్యాసంవత్సరం నుండి రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ ప్రాధమిక పాఠశాలల్లో ఇంగ్లీషు మాధ్యమాన్ని ప్రవేశపెట్టాలన్న వైఎస్ జగన్ ప్రభుత్వ నిర్ణయంపై ఇంకా చర్చ నడుస్సూనే ఉంది. ఎంత వ్యతిరోకత వచ్చినా ముఖ్యమంత్రి వెనక్కి తగ్గడంలేదు. దీనికి సంబంధించి ప్రభుత్వం ఇప్పటికే ఉత్తర్వులు కూడా ఇచ్చింది.
ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీషు మాధ్యమం ప్రవేశపెట్టడంపై ఒక పక్క విమర్శలు మరో పక్క పొగడ్తలు కూడా వస్తున్నాయి. ఇంగ్లీషు మాధ్యమం ఏర్పాటుపై సోషల్ మీడియాలో వ్యంగంగా విమర్శలూ చేస్తున్నారు. శంకరంబాడి సుందరాచారి రాసిన ‘ మా తెలుగు తల్లికి మల్లెపూ దండ’ పాటకు పేరడీగా రాసిన ఒక పాట ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నది. ఈ తెంగ్లీషు పాటను మీకోసం ఇస్తున్నాం.
మా ఇంగ్లీషు తల్లికి జాస్మిన్ పూలదండ,
మా కన్న మదర్కి ట్యూస్డే హారతులు,
స్టమక్లో బంగారు, ఐ సైటులో కరుణ,
స్మైల్లో సిరులు రోల్ ఆన్మై మదర్,
గల గల గోదారి వాకింగ్ చేస్తుంటే,
బిర బిరా కృష్ణమ్మ రన్నింగ్ చేస్తుంటేను,
గోల్డ్ క్రాప్లే హార్వెస్టు అవుతాయి,
మురిపాల పెరల్స్ రోలింగూ, అమరావతీ సిటీ సూపర్ శిల్పాలు,
త్యాగయ్య త్రోటులో తారాడు మెలోడీలు,
తిక్కయ్య పెన్నులో స్వీటు నెస్సులు,
ఫర్ ఎవర్ నిఖిలమై స్టేయింగు,
రుద్రమ్మ మజిల్ పవర్ మల్లమ్మ పతి డివోషన్,
తిమ్మరుసు ఇంటలిజెన్సు, కృష్ణరాయల పాపులారిటీ,
మా ఇయర్స్ రింగు మని రీ సౌండ్ వచ్చేదాక,
నీ గేమ్స్ ప్లేయింగ్, నీ పాటలే సింగింగు,
జై ఇంగ్లీషు తల్లీ, జై ఇంగ్లీషు తల్లీ, జై ఇంగ్లీషు తల్లీ.