న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీతో సంబంధం ఉన్న 687 ఫేస్బుక్ పేజీలను తొలగించినట్లు ఫేస్బుక్ ప్రకటించింది. కలిసికట్టుగా దొంగదారి ధోరణి (coordinated inauthentic behaviour)లో వ్యవహరిస్తున్నందుకు ఆ పేజీలను తొలగించాల్సివచ్చిందని ఫేస్బుక్ సైబర్ సెక్యూరిటీ పాలసీ చీఫ్ నథానియేల్ గ్లీషర్ తెలిపారు. ఈ ఎక్కౌంట్లన్నీ కాంగ్రెస్ ఐటి విభాగంతో సంబంధం ఉన్న వారివని ఆయన చెప్పారు. పేజీలు తొలగించడానికి కారణం ఆ పేజీల్లో పెడుతున్న సమాచారం కాదనీ, తాము ఎవరో తెలియకుండా ఉండేందుకు వారు దొంగ ఐడెంటిటీలు వాడడమేననీ ఆయన చెప్పారు.
ఈ పరిణామానికి స్పందిస్తూ, తమ పార్టీ అధికారిక పేజీలు ఏవీ తొలగించలేదని కాంగ్రెస్ పేర్కొన్నది.
This is to clarify no official pages run by INC have been taken down. Additionally, all pages run by our verified volunteers are also unaffected.
In the mean time, we are awaiting a response from Facebook to provide us a list of all pages/accounts that they have taken down.
— Congress (@INCIndia) April 1, 2019
కలిసికట్టుగా దొంగదారి ధోరణిలో వ్యవహరిస్తున్నందుకు భారత ఐటి సంస్థ సిల్వర్ టచ్కు చెందిన మరో 15 పేజీలలూ, గ్రూప్లనూ, ఎక్కౌంట్లనూ కూడా తొలగించినట్లు ఫేస్బుక్ తెలిపింది. రాజకీయ పరిణామాలు, రానున్న ఎన్నికలు, బిజెపి, కాంగ్రెస్తో సహా బిజెపి రాజకీయ ప్రత్యర్ధి పార్టీల “తప్పునడక” వంటి అంశాలపై పోస్టులను ఈ ఎక్కౌంట్లు నడుపుతున్నవారు దొంగదారుల్లో చలామణీలోకి తెస్తున్నారు.
కాంగ్రెస్ అధికార ప్రతినిధి ప్రియాంకా చతుర్వేది ఈ పరిణామంపై స్పందించారు. నమో యాప్ రూపొందించినది సిల్వర్ టచ్ సంస్థేనన్న సంగతి మరచిపోకూడదని ఆమె ట్వీట్ చేశారు. బిజెపి ప్రచారం ప్రముఖంగా చేసే ఫేస్బుక్ పేజీ మై నేషన్ను ఫేస్బుక్ తొలగించిందని ఆమె పేర్కొన్నారు.
Facebook removed 15 Facebook Pages, Groups and accounts that engaged in coordinated inauthentic behavior in India and were linked to individuals associated with an Indian IT firm, Silver Touch.
Silver Touch created the NaMo app. For better context https://t.co/n4XubDSgib— Priyanka Chaturvedi?? (@priyankac19) April 1, 2019