(న్యూస్ ఆర్బిట్ డెస్క్)
ఉగ్రవాదులకు స్వర్గధామంగా మారిన పాక్ను బ్లాక్ లిస్ట్లో పెట్టడానికి ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ (ఎఫ్ఏటిఎఫ్) సిద్ధమయినట్లు తెలుస్తోంది. ఉగ్రవాద కార్యకలాపాలకు నిధులు అందే మార్గాలను నిరోధించే ఎఫ్ఏటిఎఫ్ ప్రాన్స్ వేదికగా పని చేస్తున్నది. ప్రస్తుతం ప్యారిస్లో ప్లీనరీ సమావేశాలు జరుగుతుండగా ఈ సమావేశాల్లో పాక్కు ఒక్క సభ్య దేశం కూడా మద్దతు ఇవ్వలేదు. గతంలో ఈ సంస్థ పాక్ను గ్రే జాబితాలో పెట్టి ఉగ్రవాద కార్యకలాపాలను అరికట్టాలని హెచ్చరికలు జారీ చేసింది. మొత్తం 27 సిఫార్సులను చేయగా పాక్ వాటిలో ఆరింటిని మాత్రమే అమలు చేసింది. దీంతో ఆ దేశాన్ని డార్క్ గ్రే జాబితాలో పెట్టాలని ఎఫ్ఏటిఏఫ్ భావిస్తోంది.
మనీ లాండరింగ్తో పాటు ఉగ్రవాదులకు ఆర్థిక సహాయాలను అరికట్టేందుకు అంతర్జాతీయంగా జరుగుతున్న పోరాటానికి ఏ దైశమైనా సహకరించకపోతే బ్లాక్ లిస్ట్లో పెడతారు. ఏ దేశాన్నైనా బ్లాక్ లిస్ట్లో పెట్టడానికి ముందుగా డార్క్ గ్రే లిస్ట్లో పెట్టొచ్చు. తర్వాత బ్లాక్ లిస్ట్లో పెట్టే అవకాశం ఉంటుంది.
పాకిస్తాన్ను ఎఫ్ఏటిఎఫ్ ఈ జాబితాలోకి చేరిస్తే అంతర్జాతీయ ద్రవ్యనిధి, ప్రపంచ బ్యాంకు, ఆసియా అభివృద్ధి బ్యాంక్ వంటివి పాక్కు గ్రేడ్ తగ్గిస్తాయి. దీంతో ఆ దేశం ఆర్థిక ఇబ్బందుల్లో చిక్కుకుంటుంది. పారిస్లో ఈ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో ఈ ఉచ్చులోంచి తప్పించుకునేందుకు పాక్ ఇటీవల పలువురు ఉగ్రవాద నేతలను అరెస్టు చేసిన విషయం తెలిసిందే.