అమరవాతి: వైసిపి ఎల్పి సమావేశంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి సంచలన నిర్ణయం ప్రకటించారు. గతంలో ఎన్నడూ జరగని విధంగా కొత్త విధానానికి శ్రీకారం చుట్టబోతున్నారు.
తన మంత్రి వర్గంలో ఐదు కులాలకు చెందిన వారు ఉప ముఖ్యమంత్రులుగా ఉండబోతున్నారని సిఎం జగన్ వెల్లడించారు.
ఎస్సి, ఎస్టి, బిసి, మైనార్టీ, కాపు వర్గాల నుండి ఉప ముఖ్యమంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయనున్నారని జగన్ చెప్పారు.
25మందితో పూర్తి స్థాయి మంత్రివర్గం ఏర్పాటు చేస్తున్నట్లు సిఎం జగన్ చెప్పారు. రెండేళ్ల తరువాత మంత్రివర్గంలో మార్పులు ఉంటాయనీ, కొత్తవారికి మంత్రివర్గంలో అవకాశం కల్పించనున్నట్లు సిఎం జగన్ వెల్లడించారు.
అవినీతికి ఏ మాత్రం ఆస్కారం లేకుండా పాలన జరగాలనీ, రాష్ట్రం మొత్తం మన వైపు చూస్తోదనీ, మనం వేసే ప్రతి అడుగు ప్రజలకు దగ్గర చేయాలని జగన్మోహనరెడ్డి అన్నారు.
జ్యూడీషియల్ కమిషన్ గురించి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తితో సంప్రదించామని జగన్ చెప్పారు. ఇక నుండి ప్రతి టెండర్ ప్రక్రియ పూర్తి పారదర్శకంగా జరుగుతుందని జగన్ అన్నారు. జ్యుడీషియల్ కమిషన్ సూచనల మేరకు ప్రతి టెండర్లో మార్పులు ఉంటాయనీ, ఆరోపణలు వచ్చిన వాటిపై రివర్స్ టెండర్ ప్రక్రియ చేడతామని జగన్ వివరించారు. రివర్స్ టెండర్ ద్వారా ఎంత మిగిలిందో ప్రజలకు వివరిస్తామని జగన్ చెప్పారు. ఎస్సి, ఎస్టి, బిసి, మైనార్టీలకు 50శాతం పనులను నామినేషన్ పద్ధతిలో కేటాయిస్తామని జగన్ చెప్పారు.