న్యూఢిల్లీ: మోదీ ప్రభుత్వం ప్రజల గొంతును నొక్కేస్తుందని కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ అన్నారు. పౌరసత్వ చట్టంపై నిరసనలు తీవ్రస్థాయికి చేరుకున్న నేపథ్యంలో మంగళవారం సోనియాగాంధీ నేతృత్వంలో విపక్షనేతల బృందం రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ను కలిసింది. సీఏఏకు వ్యతిరేకంగా దేశవ్యాప్త ఆందోళనలు, నేపథ్యంలో చట్టాన్ని వెనక్కి తీసుకోవాలని రాష్ట్రపతిని కోరారు. జామియా వర్సిటీలో విద్యార్థులపై పోలీసుల దాడిపై రాష్ట్రపతికి ఫిర్యాదు చేశారు. సోనియా వెంట రాష్ట్రపతిని కలిసినవారిలో గులాంనబీ ఆజాద్, సీతారాం ఏచూరి, డి.రాజా, డెరెక్ ఓబ్రెయిన్, రాంగోపాల్ యాదవ్ తదితరులున్నారు.
అనంతరం సోనియాగాంధీ మీడియాతో మాట్లాడుతూ పోలీసులు ఢిల్లీలో జామియా మిలియా ఇస్లామియా యూనివర్సిటీలోని ఉమెన్స్ హాస్టల్లోకి ప్రవేశించి..వారిని బయటకు లాక్కొచ్చి కనికరం లేకుండా కొట్టారని మండిపడ్డారు. సీఏఏపై ఈశాన్యరాష్ట్రాల్లో నెలకొన్న ఆందోళనకర పరిస్థితులు దేశం మొత్తం వ్యాపిస్తున్నాయని, ముందుముందు భయానక పరిస్థితులు ఏర్పడుతాయేమోనని ఆందోళన వ్యక్తం చేశారు. శాంతియుత పద్దతిలో చేస్తున్న నిరసనలను పోలీసులు హింసాత్మకంగా చేస్తున్నారని ఆరోపించారు. ప్రజల అభిప్రాయానికి వ్యతిరేకంగా ఉన్న పౌరసత్వ సవరణ బిల్లును ఉపసంహరించుకోవాలని రాష్ట్రపతిని కోరినట్లు తెలిపారు.
We are anguished at the manner in which the police has dealt with peaceful demonstrations. And as you all have seen the BJP govt has no compulsion when it comes to shutting down people’s voices: Congress President Smt. Sonia Gandhi.
#HumaraDeshJalRahaHai pic.twitter.com/THpnNCjIl9
— Congress (@INCIndia) December 17, 2019