ఇస్లామాబాద్/న్యూఢిల్లీ: నియంత్రణ రేఖ వెంబడి తమ దేశానికి చెందిన గగనతలంలో బుధవారం ఉదయం నుంచీ దాడులు చేపట్టామని పాకిస్థాన్ ప్రకటించింది. అంతేగాక, భారత్కు చెందిన రెండు యుద్ధ విమానాలను కూల్చివేసినట్లు పాకిస్థాన్ ఇంటర్ సర్వీస్ పబ్లిక్ రిలేషన్స్ డీజీ అసిఫ్ గఫూర్ వెల్లడించారు.
పాక్ యుద్ధ విమానాలను వెంటాడుతూ నియంత్రణ రేఖను దాటిన రెండు భారత వాయుసేనకు చెందిన యుద్ధ విమానాలను కూల్చివేసినట్లు ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. వీటిలో ఒక విమానాన్ని పాక్ ఆక్రమిత కాశ్మీర్లో కూల్చేయగా.. మరో విమానాన్ని కాశ్మీర్లో కూల్చివేసినట్లు తెలిపారు.
In response to PAF strikes this morning as released by MoFA, IAF crossed LOC. PAF shot down two Indian aircrafts inside Pakistani airspace. One of the aircraft fell inside AJ&K while other fell inside IOK. One Indian pilot arrested by troops on ground while two in the area.
— DG ISPR (@OfficialDGISPR) February 27, 2019
అంతేగాక, భారత వాయుసేనకు చెందిన ఓ పైలట్ను కూడా అదుపులోకి తీసుకున్నామని వెల్లడించారు. అయితే, పాక్ చేసిన ఈ విషయాలను భారత్ కొట్టిపారేసింది. భారత వాయుసేన వెంటాడటంతో తోక ముడిచిన పాకిస్థాన్.. కట్టుకథలు చెబుతోందని మండిపడింది. వాయుసేనకు చెందిన ఏ విమానం కూడా దాడికి గురికాలేదని స్పష్టం చేసింది. భారత పైలట్ తమ వద్ద ఉన్నాడన్న పాక్ వాదనను కూడా కొట్టిపారేసింది. వాయుసేనకు చెందిన పైలట్లందరూ క్షేమంగానే తమ వద్ద ఉన్నారని వెల్లడించింది.
#Pakistanstrikesback #PAF undertook strikes across LoC from Pakistani airspace. Sole purpose of this action was to demonstrate our right, will and capability for self defence. We do not wish to escalate but are fully prepared if forced into that paradigm#PakistanZindabad
— Spokesperson ?? MoFA (@ForeignOfficePk) February 27, 2019
పాక్ విమానాలను తరిమికొట్టిన భారత్
బుధవారం ఉదయం పాక్ యుద్ధవిమానాలు నియంత్రణ రేఖను దాటి భారత భూభాగంలోకి వచ్చి బాంబులు జారవిడిచాయి. పాక్ యుద్ధవిమానాల కదలికలపై ముందు నుంచే అప్రమత్తంగా ఉన్న భారత వాయుసేన వెంటనే ప్రతిస్పందించింది.
భారత్కు చెందిన యుద్ధవిమానాలు వాటిని అడ్డుకొనేందుకు వెళ్లాయి. భారత వాయుసేన విమానాల ప్రతిఘటనతో పాక్ విమానాలు తోకముడిచాయి. పూంచ్, రాజౌరీ సెక్టార్లలో ఈ ఘటనలు చోటు చేసుకొన్నాయి.
భారత్ భూభాగంలోకి చొచ్చుకొచ్చిన విమానాలు పాక్ ఎఫ్-16 విమానాలుగా తెలుస్తోంది. భారత వాయుసేన జరిపిన దాడిలో ఓ పాకిస్థాన్ ఎఫ్-16 విమానం పాక్ పరిధిలోని లామ్ లోయలో కుప్పకూలినట్లు సమాచారం. ఇరుదేశాల మధ్య ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో కాశ్మీర్లో పౌరవిమానాల రాకపోకలపై నిషేధం విధించారు.