న్యూఢిల్లీ: ఆదాయం పన్ను రిటర్ను దాఖలు చేసేవారు ఇకపై పాన్, ఆధార్ ఒకదాని స్థానంలో ఒకటి ఉపయోగించేందుకు కుదురుతుంది. శుక్రవారం లోక్సభలో తన మొట్టమొదటి బడ్జెట్ సమర్పించిన ఆర్ధికమంత్రి నిర్మలా సీతారామన్ ఈ ప్రతిపాదన ప్రకటించారు.
పాన్ కార్డు లేనవారు ఆదాయం పన్ను రిటర్ను దాఖలు చేసేప్పుడు దాని బదులు ఆధార్ కార్డు వాడేందుకు వీలు కల్పిస్తున్నట్లు ఆర్ధిక మంత్రి ప్రకటించారు.
ఇండియా పాస్పోర్టు ఉన్న ప్రవాస భారతీయులు ఇండియా రాగానే వారికి ఆధార్ నంబరు జారీ చేసే అవకాశం కల్పిస్తున్నట్లు ఆమె ప్రకటించారు. ప్రస్తుతానికి ప్రవాస భారతీయులు ఇండియా వచ్చిన తర్వాత ఆధార్ కోసం 180 రోజులు ఆగాల్సిఉంది.