ముంబై: దేశవ్యాప్తంగా ఉల్లి ధరలు ఆకాశాన్నంటిన వేళ.. వింతైన సంఘటనలు కూడా చోటుచేసుకుంటున్నాయి. ముంబయిలోని డొంగ్రీ కూరగాయల మార్కెట్లో ఇద్దరు వ్యక్తులు ఉల్లిపాయలను దొంగిలించారు. డిసెంబర్ 5వ తేదీ తెల్లవారుజామున 4:30 గంటల సమయంలో దుకాణాల వద్దకు చేరుకున్న ఇద్దరు వ్యక్తులు ఉల్లిపాయలను దొంగిలించారు. 22 బస్తాలలో ఉన్న 112 కిలోల ఉల్లిపాయలను చోరీ చేశారు. ఈ దృశ్యాలు అక్కడున్న సీసీటీవీ కెమెరాల్లో రికార్డు అయింది. దీంతో బాధిత దుకాణం యజమానులు.. పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. సిసిటివి ఫుటేజీని పరిశీలించి ఇద్దరు నిందితులను అరెస్టు చేశారు. వారి నుంచి రూ. 21,160 విలువ చేసే ఉల్లిపాయలను స్వాధీనం చేసుకున్నారు.
#WATCH Maharashtra: Police have arrested two men for stealing onions worth Rs 21,160 from two shops on December 5 in Dongri area of Mumbai. (CCTV footage) pic.twitter.com/keNxjbkFQ5
— ANI (@ANI) December 11, 2019
దేశంలో ఉల్లి ధరలు అమాంతంగా పెరిగిన సంగతి తెలిసిందే. దీంతో ప్రజలు ఉల్లిపాయాలు కొనాలంటేనే గొల్లుమనే పరిస్థితి నెలకొంది. దేశంలోని ప్రధాన నగరాల్లో ప్రస్తుతం కిలో ఉల్లి రూ.100కుపైగా ఉంది. ఇటీవల పంజాబ్లో అర కిలో ఉల్లిపాయలను చోరీ చేసేందనే ఆరోపణలతో పోలీసులు ఒక మహిళను అరెస్టు చేశారు.