అమరావతి: ఏపీలో సీఎం జగన్ పాలనకు వందకు 150 మార్కులు వేస్తానని టీడీపీ మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి అన్నారు. జగన్ పాలన చాలా జనరంజకంగా సాగుతోందని వ్యాఖ్యానించారు. అయితే, పాలనలో మాత్రం కింద, మీద పడుతున్నారని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. రాష్ట్రంలో ఎన్నో ట్రావెల్స్ బస్సులున్నప్పటికీ… జగన్ కు తమ బస్సులే కనిపిస్తున్నాయని అసహనం వ్యక్తం చేశారు. ఇప్పటి వరకు తమవి 31 బస్సులు సీజ్ చేశారని విమర్శించారు. 70 ఏళ్ల నుంచి ట్రావెల్స్ రంగంలో ఉన్నామని… చిన్నచిన్న పొరపాట్లు ఆర్టీసీ సహా ఏ ట్రావెల్స్ కైనా సహజమేనని చెప్పారు. తమ బస్సులను మాత్రమే భూతద్దంలో చూస్తూ సీజ్ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫైన్ లతో పోయేదానికి సీజ్ చేయడం ఎంత వరకు కరెక్ట్ అని ప్రశ్నించారు. ఈ విషయంపై కోర్టుకు వెళతామని చెప్పారు. జగన్ అప్పుడు, ఇప్పుడు, ఎప్పుడూ తమ అబ్బాయేనని జేసీ వ్యాఖ్యానించారు. ఇటీవల రవాణా శాఖ జేసీ బ్రదర్స్కు చెందిన దివాకర్ ట్రావెల్స్ బస్సులు సీజ్ చేసి, పర్మిట్లు రద్దు చేసి షాక్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో బస్సులు సీజ్ చెయ్యటంపై జేసీ దివాకర్ రెడ్డి స్పందించారు.
previous post
next post