(న్యూస్ ఆర్బిట్ డెస్క్)
అమరావతి: రాజధాని గ్రామాల్లో పెద్ద ఎత్తున పోలీసు బలగాలను దింపి యుద్ధ వాతావరణాన్ని తలపించేలా కవాతు నిర్వహించడం ఏమిటంటూ టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ మండిపడ్డారు. రైతు ఆనందంగా ఉండాల్సిన చోట పోలీసు కవాతా అని ప్రశ్నించారు. ఒక్కో గ్రామానికి వెయ్యి మంది పోలీసులను దింపి ఉద్యమాన్ని అణిచివేయాలని అనుకోవడం జగన్ అవివేకానికి నిదర్శనమని అన్నారు.
గ్రామస్తులను ఇళ్లలో బందిస్తారా? ఇంత ఘోరం మరొకటి ఉండదని అన్నారు. అంత కండకావరం ఎందుకు అంటూ దుయ్యబట్టారు. ప్రశాంతంగా ఉన్న గ్రామాల్లో యుద్ధ వాతావరణం తీసుకొచినందుకు వైసిపి ప్రభుత్వం మూల్యం చెల్లించుకోకతప్పదని లోకేష్ హెచ్చరించారు.