(న్యూస్ ఆర్బిట్ బ్యూరో)
అమరావతి: తెలుగుదేశం పార్టీ శాసనసభాపక్ష సమావేశంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి గురించి రెండు సినిమా క్లిప్పింగ్లను ప్రదర్శించారు. వైసిపి ప్రభుత్వం మూడు రాజధానులను ప్రతిపాదించిన నేపథ్యంలో గతంలో ఇలాంటి అంశాలు ఉన్న సినిమాల క్లిప్పింగ్లను టిడిఎల్పిలో ప్రదర్శించారు.
మహమ్మద్ బీన్ తుగ్లక్, హింసించే రాజు 23వ పులికేశి సినిమాలకు సంబంధించిన క్లిప్పింగ్లను సమావేశంలో ప్రదర్శించారు. రాజధానిని ఢిల్లీ నుండి దౌలతాబాద్కు తరలించిన మహమ్మద్ బిన్ తుగ్లక్తో జగన్ను పోల్చారు. అదే విధంగా తమిళ హస్యనటుడు వడివేలు నటించిన హింసించే రాజు 23వ పులికేసి సినిమాలోని క్లిప్పింగ్లను కూడా ప్రదర్శించారు. ఈ రెండు సినిమాలోని క్లిప్పింగ్లను చూసిన టిడిపి ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు రాష్ట్రంలో జగన్ పాలన ఇలానే ఉందంటూ వ్యాఖ్యానించారు.