అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్కు ఊహించని షాక్ తగిలింది. గ్రీన్ కో కంపెనీకి ప్రభుత్వం ఇచ్చిన నోటీసుపై ట్రిబ్యునల్ స్టే ఇచ్చింది. ఈ నెల 12న గ్రీన్కో కంపెనీకి చెందిన మూడు యూనిట్లకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నోటీసులు జారీ చేసింది. నోటీసులు ఇవ్వడాన్ని ట్రిబ్యునల్ తప్పుబట్టింది.
యూనిట్ ధర నాలుగున్నర రూపాయల నుండి రెండు రూపాయల 44 పైసలకు తగ్గించాలని గ్రీన్ కో కంపెనీకి ప్రభుత్వం నోటీసు జారీ చేసింది. దీనిపై ఆ కంపెనీ ధరల నిర్ణయం రెగ్యులేటరీ యంత్రాంగం పరిధిలోకి వస్తుందని తేల్చి చెప్పింది. రాజస్థాన్లో యూనిట్ రెండు రూపాయల 44 పైసలకు ఇచ్చినంత మాత్రాన అదే ధరకు ఆంధ్రప్రదేశ్లో ఇవ్వడం కుదరదని గ్రీన్కో కంపెనీ స్పష్టం చేసింది.