(న్యూస్ ఆర్బిట్ బ్యూరో)
ముంబై దేశంలోని 130 కోట్ల మంది ప్రజలందరూ హిందువులేనన్న ఆరెస్సెస్ అధినేత మోహన్ భగవత్ మాటలను బిజెపి మిత్రపక్షం నేత, కేంద్రమంత్రి రామ్దాస్ అథవాలే ఖండించారు.
అందరూ హిందువులేనని చెప్పడం సరైనది కాదు. దేశంలో బౌద్ధులు, ఫార్సీలు, సిక్కులు, క్రైస్తవులు, హిందువులు, జైనులు , లింగాయతులు, జైనులు.. ఇలా భిన్న మతాల వారు ఉన్నారు. వారందరూ హిందువులేనని అనడం సరైనది కాదు. వారందరూ భారతీయులేనని మోహన్ భగవత్ అన్నట్లుయితే సరే అని అథవాలే వ్యాఖ్యానించారు.
హైదరాబాద్లో గురువారం ఆరెస్సెస్ సభను ఉద్దేశించి భగవత్ ప్రసంగిస్తూ, ఆరెస్సెస్ దృష్టిలో భారతమాత బిడ్డలు అందరూ హిందువులేనని అన్నారు. ఈ వ్యాఖ్యలను మజ్లిస్ నైయకుడు అసదుద్దీన్ ఒవైసీ, బిఎస్పి నేత మాయావతి కూడా ఖండించారు. ఇండియాలో ఒకే మతం ఉండాలన్నది సంఘ్ ఉద్దేశమనీ, అంబేద్కర్ రాసిన భారత రాజ్యాంగం ఉన్నంతవరకూ అది జరగదనీ ఒవైసీ అన్నారు. ఈ దేశంలో సర్వమత సమభావన ఉందని ఆయన పేర్కొన్నారు.