NewsOrbit
టాప్ స్టోరీస్

‘విజయసాయి నోట పోకిరి డైలాగ్’

అమరావతి: ముఖ్యమంత్రి చంద్రబాబు ఈవిఎంల పని తీరుపై సందేహం వ్యక్తం చేస్తూ కేంద్ర ఎన్నికల ప్రధాన అధికారి సునీల్ అరోరాతో సమావేశం అవ్వటంపై వైసిపి రాజ్యసభ సభ్యడు విజయసాయి రెడ్డి ట్విట్టర్ వేదికగా వరుస ట్వీట్లతో విమర్శలు చేశారు.

40 ఇయర్స్ ఇండస్ట్రీ, ఈవెంట్ మేనేజర్‌గా మాత్రమే సక్సెస్ అయ్యాడని విజయసాయి రెడ్డి ఎద్దేవా చేశారు. విలువలు కలిగిన రాజనీతిజ్ణుడు కాలేకపోయాడని ఆయన విమర్శించారు. ‘ఓడినా గెలిచాననే పిడివాదం. దానికి కుల మీడియా వంత పాడటం. ప్రజలు మూకుమ్మడిగా ఈసడించుకున్నా ఈవిఎంల పైన పడి ఏడవడం. ఈ నలబై రోజులన్నా అపద్ధర్మ సిఎంగా పదవిని ఆస్వాదించు బాబూ’ అంటూ విజయసాయి రెడ్డి ట్వీట్ చేశారు.

దేశమంతా ఎలక్షన్ మూడ్‌లో ఉంటే ఓట్లు రాలని చంద్రబాబు ఈసి మీద ఫిర్యాదులంటూ ఢిల్లీ వెళ్లి పరువు తీసుకుంటున్నాడని విజయసాయి రెడ్డి అన్నారు. 80 శాతం పోలింగ్ జరిగితే మిషన్లు పనిచేయలేదని అనడంలో లాజిక్ అర్థం కాక ఈయనతో అంటకాగిన నాయకులు కూడా తల పట్టుకుంటున్నారని ఆయన ఎద్దేవా చేశారు. ఈ బురద తమకెక్కడ పూస్తాడో అని అంతా దూరం పెట్టారని విజయసాయి రెడ్డి చెప్పుకొచ్చారు.

‘సిఎస్ పునేఠా, ఇంటెలిజెన్స్ చీఫ్‌ వెంకటేశ్వరరావు, ముగ్గురు ఎస్‌పిలు, పక్కకు తప్పించిన అధికారులు చంద్రబాబుకు కీలుబొమ్మలని చూపే ఆధారాలు ఎలక్షన్ కమిషన్ దగ్గరున్నాయి. అనవసరంగా కెలుక్కుని అవన్నీ బయటపెట్టించుకుంటాడు. బట్టలు చింపుకుని ఢిల్లీ వీధుల్లో పరువు తీసుకోవడం తప్ప ప్రయోజనం ఉంటుందా?’ అని విజయసాయి రెడ్డి ప్రశ్నించారు.

చంద్రబాబు వ్యవహారం పరీక్ష సరిగ్గా రాయని విద్యార్థి ప్రశ్నపత్రంపై ఫిర్యాదు చేసినట్టుందని విజయసాయి రెడ్డి ఎద్దేవా చేశారు. కేంద్ర ఇంటెలిజెన్స్ చీఫ్‌ను బదిలీ చేయకుండా తన బంధువైన ఏబి వెంకటేశ్వరరావును ఎలా పక్కకు తప్పిస్తారని అడుగుతుంటే ఇతని మానసిక స్థితి బాగా లేదని దేశమంతా తెలిసి పోయిందని విహాయసాయి రెడ్డి అన్నారు.

బ్యాలెట్ పేపర్ రోజుల్లో రిగ్గింగ్ తేలికగా జరిపేవారనీ, ఎన్నికల సిబ్బందినీ, ఏజెంట్లను మ్యానేజ్ చేస్తే టకాటకా గుద్ది బాక్సుల్లో వేయించిన అనుభవం చంద్రబాబుదని విజయసాయి రెడ్డి ఆరోపించారు. ఓటింగ్ మిషన్లను రిగ్గింగ్ చేయాలంటే చాలా సమయం పడుతుందనీ, అందరికీ తెలిసిపోతుందనీ, అందుకే పదేపదే బ్యాలెట్ పేపర్ కావాలంటున్నాడనీ విజయసాయి రెడ్డి దుయ్యబట్టారు.

ఎవరు కొడితే మైండ్ బ్లాక్ అవుతుందో వారే ఆంధ్ర ఓటర్లు అని విజయసాయి రెడ్డి అన్నారు. మైండ్ బ్లాకయిన వ్యక్తి తనకెందుకు అలా అయిందో గ్రహించకుండా ఈవిఎంలపై ఓటు వేయడం విద్యావంతులకు కూడా కష్టమని అంటున్నాడని, వివి ప్యాట్ల లెక్కింపుపై సుప్రీం కోర్టు తీర్పునూ తప్పుపడుతున్నాడని విజయసాయి రెడ్డి విమర్శించారు. దెబ్బ మామూలుగా తగిలినట్టు లేదు అంటూ విజయసాయి రెడ్డి వ్యంగ్యాస్త్రాలు సంధించారు.

Related posts

Ayodhya : జ‌న‌వ‌రి 22 : అయోధ్య రామ‌మందిరం ఓపెనింగ్‌.. మీ గ్రామాల్లో ఈ ప‌నులు చేయండి..!

Saranya Koduri

Subrata Roy: సుబ్రతా రాయ్ ఇక లేరు…సహారా గ్రూప్ స్థాపకుడుకి 75 సంవత్సరాలు, దీర్ఘకాలిక అనారోగ్యం తో కన్ను మూత.

Deepak Rajula

International Girl Child Day: అంతర్జాతీయ బాలికా దినోత్సవంపై స్పెషల్ స్టోరీ.. 2023 థీమ్ ఏంటి? దీని చరిత్ర..

siddhu

Amaravati Capital Case: అమరావతి రాజధాని కేసు డిసెంబర్ కు వాయిదా వేసిన సుప్రీం కోర్టు .. ఏపీ సర్కార్ కు షాక్ | Supreme Court Shocks AP Govt in Amaravti Case 

sharma somaraju

Kuno National Park: కునో నేషనల్ పార్కుకు మరో 12 చిరుతలు.. ఈ పార్కుకు వెళ్లాలని అనుకుంటున్నారా? హైదరాబాద్, విజయవాడ నుంచి ఇలా వెళ్లండి!

Raamanjaneya

Mughal Gardens: అమృత ఉద్యాన్‌గా మొఘల్ గార్డెన్.. దీని చరిత్ర.. ప్రత్యేకతలు!

Raamanjaneya

థార్ డెసర్ట్‌లో ఇసుక తిన్నెలు నడుమ అద్భుతమైన ఆహారం,  ప్రదర్శనలు, కచేరీలు!

Raamanjaneya

KCR’s BRS: నూతన శాతవాహన సామ్రాజ్యం దిశగా పావులు కదుపుతున్న నయా శాతవాహనుడు సీఎం కేసీఆర్

sharma somaraju

ఆ ఇద్దరూ ఒకే వేదికపై ..! బీజేపీ భారీ ప్లాన్స్, సక్సెస్ అవుతాయా..!?

Special Bureau

Why Lawrence Bishnoi wants Salman Khan Dead? నాలుగు సంవత్సరాల నుండి సల్మాన్ నీ చంపడానికి ప్లాన్ చేస్తున్న దుండగులు..!!

Siva Prasad

PK Team: పీకే టీమ్ – 1500మంది రెడీ ..! వైసీపీ కోసం భారీ ప్లాన్స్..!

Special Bureau

YSRCP: ఈ విషయాలు గమనిస్తే దటీజ్ జగన్ అనాల్సిందే(గా)..?

sharma somaraju

Rahul Gandhi: వరంగల్ సభలో టీఆర్ఎస్ పై రాహుల్ సీరియస్ కామెంట్లు..!!

sekhar

Telangana Crime: భాగ్యనగరంలో అమానవీయ ఘటన! పదహారు మంది బాలల బట్టలూడదీసి కొట్టినా కిమ్మనని పోలీసులు,కెసిఆర్ సర్కారు!

Yandamuri

TDP ChandraBabu: కార్యకర్తలపై కేసులు.. బాబోరీ వెరైటీ కూతలు..!!

sekhar

Leave a Comment