శ్రీకాళహస్తి: బిజెపి మరోసారి గెలవటం చారిత్రక అవసరమని ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అన్నారు. ఆదివారం ఆయన శ్రీకాళహస్తిలో ఎన్నికల ప్రచారంలో పాల్గొని ప్రసంగించారు.
నాలుగు రోజుల్లో జరగనున్న ఎన్నికల్లో అభివృద్ధి, సంక్షేమం, దేశ రక్షణ కోసం పోరాడుతున్న బిజెపి ఒకవైపు..ఇవేవి పట్టనటువంటి, కేవలం వ్యక్తిగత స్వార్ధం కోసం మాత్రమే ఆలోచించే వైసిపి, టిడిపి, టిఆర్ఎస్ వంటి పార్టీలు మరోవైపు పోటీ చేస్తున్నాయని ఆదిత్యనాథ్ అన్నారు.
టిఆర్ఎస్, వైసిపి, టిడిపి పార్టీలు కుటుంబ పాలన కోసం, వారి తర్వాత వారి వారసులు అధికారంలోకి రావటం కోసం పని చేస్తుంటే బిజెపి అభివృద్ధి, సంక్షేమం కోసం పని చేస్తుందని ఆదిత్యనాథ్ పేర్కొన్నారు.
బిజెపిలో ఒక సామాన్య కార్యకర్త కూడా ఉన్నత పదవులు అలంకరించే అవకాశం ఉందని ఆదిత్యనాథ్ తెలిపారు. సామాన్య కార్యకర్త వెంకయ్య నాయుడు ఉప రాష్ట్రపతి అయ్యారనీ, చాయ్ వాలా మోది ప్రధాన మంత్రి అయ్యారనీ, బూత్ కమిటీ అధ్యక్షుడు అమిత్ షా నేడు బిజెపి జాతీయ అధ్యక్షుడు అయ్యారనీ ఆదిత్యనాథ్ గుర్తు చేశారు.అదే టిడిపి, కాంగ్రెస్లో వారి వారి వారసులు తప్ప మరొకరు ఉన్నత పదవి పొందే అవకాశం లేదని ఆదిత్యనాథ్ పేర్కొన్నారు.
మహోన్నత నాయకుడు ఎన్టీఆర్ ఏ కాంగ్రెస్ పార్టీని ద్వేషించి టిడిపిని స్థాపించారో అటువంటి కాంగ్రెస్ పార్టీతో నేడు చంద్రబాబు చేతులు కలిపారని ఆదిత్యనాథ్ విమర్శించారు. గత ఎన్నికల్లో బిజెపితో పొట్టుకున్నారని ఆదిత్యనాథ్ గుర్తు చేశారు.
చంద్రబాబు రాష్ట్రం కోసమో, దేశం కోసమో కాంగ్రెస్ పార్టీతో కలవలేదనీ, కేవలం తన వ్యక్తిగత స్వార్ధం కోసమే పొత్తు పెట్టుకున్నారని ఆదిత్యనాథ్ ఆరోపించారు. అవకాశవాద రాజకీయాలకు చంద్రబాబు పెట్టింది పేరని ఆదిత్యనాథ్ పేర్కొన్నారు.
కాంగ్రెస్, టిడిపి, ఇంకా కొన్ని పార్టీలు వ్యతిరేకిస్తున్నయని ఆదిత్యనాథ్ అన్నారు. మోది దేశాన్ని అభివృద్ధి పదంలో తీసుకెళ్లటం చూడలేక, అవినీతిని కూకటి వేళ్ళతో పెకలిస్తున్నందుకు, పాక్ భూభాగంలోకి వెళ్లి మరి దాడులు చేసి క్షణ క్షణం దేశానికి కాపలా కాస్తున్నందుకు, కాంగ్రెస్ పార్టీ 55 ఏళ్లలో చేయని విధంగా ఐదేళ్ళలో మోది వందేళ్ల అభివృద్ధి చేసినందుకు ఈ పార్టీలు వ్యతిరేకిస్తున్నాయని ఆదిత్యనాథ్ వివరించారు. అభివృద్ధి, సంక్షేమం కోసం బిజెపిని గెలిపించాలని ఆదిత్యనాథ్ పిలుపునిచ్చారు.