అమరావతి: ప్రభుత్వ ఏర్పాటు దిశగా వైఎస్ఆర్సిపి అడుగులు ప్రారంభించింది. పార్టీ శాసనసభాపక్ష నేతగా పార్టీ అధినేత వైఎస్ జగన్మోహనరెడ్డిని ఎన్నుకునేందుకు తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో మరి కొద్ది సేపటిలో సమావేశం జరగనుంది. వైసిపి నుండి విజయం సాధించిన 150మంది ఎమ్మెల్యేలు జగన్మోహనరెడ్డిని శాసనసభాపక్ష నేతగా ఎకగ్రీవంగా ఎన్నకోనున్నారు. ఈ సమావేశానికి ఎమ్మెల్సీ, ఎంపిలనూ ఆహ్వనించారు. వైసిపి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపిలూ ఇప్పటికే చేరుకోవడంతో తాడేపల్లి క్యాంప్ కార్యాలయం సందడిగా మారింది.
జగన్మోహనరెడ్డిని శాసనసభాపక్ష నేతగా ఎన్నుకున్న తరువాత ఆ తీర్మాన పత్రాన్ని సాయంత్రం నాలుగున్నర గంటలకు హైదరాబాదులో గవర్నర్ ఇఎస్ఎల్ నరసింహన్కు సమర్పించనున్నారు. ఎమ్మెల్యేల బృందంతో కలిసి వెళ్లి జగన్ గవర్నర్కు ఈ ప్రతిని అందజేసి ప్రభుత్వం ఏర్పాటుకు ఆహ్వానించాల్సిందిగా కోరనున్నారు.
ఈ నెల 30వ తేదీన విజయవాడలో ముఖ్యమంత్రిగా జగన్మోహనరెడ్డి ప్రమాణ స్వీకారం చేయనున్నారు.
శాసనసభాపక్ష సమావేశం కాగానే 11.30గంటలకు వైఎస్ఆర్సిపి పార్లమెంటరీ పార్టీ సమావేశం నిర్వహించనున్నారు. పార్టీ అధ్యక్షుడు జగన్ నేతృత్వంలో నిర్వహిస్తున్న ఈ సమావేశంలో పార్టీ పార్లమెంటరీ పక్ష నేతను ఎన్నుకోనున్నారు.