విజయవాడ: వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డికి దమ్ముంటే అమరావతి, విశాఖపట్నంలో రెండు చోట్లా ఇన్ సైడర్ ట్రేడింగ్ పై విచారణ జరిపించాలని టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న డిమాండ్ చేశారు. ఈ మేరకు తన ట్విట్టర్ ఖాతాలో వరుస ట్వీట్లు పెట్టారు. ” ఇన్ సైడర్ ట్రేడింగ్ లో కొన్న భూముల విలువ లక్ష కోట్లా ఎంపీ విజయసాయి రెడ్డి గారు? మరి మీ జగన్ గారు గాడిదలు కాస్తున్నారా? శుక్రవారం కబుర్లు ఎందుకు విజయసాయి రెడ్డి గారు. దమ్ముంటే అమరావతి, విశాఖపట్నం రెండు చోట్లా ఇన్ సైడర్ ట్రేడింగ్ పై విచారణ చేయించు” అని సవాల్ విసిరారు.
“ఆంధ్రప్రదేశ్ అప్పుల్లో ఉంది అని ఏడుపులు ఎందుకు? ముందు మీరు, జగన్ గారు చేసిన తప్పులు ఒప్పుకొని దోచుకున్న లక్ష కోట్లు వెనక్కి ఇవ్వండి అప్పు తీరిపోతుంది” అని మరో ట్వీట్ చేశారు.
ఆంధ్రప్రదేశ్ అప్పుల్లో ఉంది అని ఏడుపులు ఎందుకు? ముందు మీరు, జగన్ గారు చేసిన తప్పులు ఒప్పుకొని దోచుకున్న లక్ష కోట్లు వెనక్కి ఇవ్వండి అప్పు తీరిపోతుంది.(2/2)
— Budda Venkanna #StayHomeSaveLives (@BuddaVenkanna) January 10, 2020