అమరావతి: రాజధాని అమరావతి కోసం మందడంలో ఓ రైతు కూలీ ఆత్మహత్య చేసుకున్నాడు. రాజధాని తరలిపోతుందంటూ గత కొద్దిరోజులుగా మానసిక ఆందోళనకు గురైన వేమూరి గోపి(20) అనే రైతుకూలీ ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. రాజధాని తరలింపు ఆవేదనతోనే ఆత్మహత్య చేసుకున్నాడని కుటుంబసభ్యుల చెబుతున్నారు. రాజధానిలో గోపి ట్రాక్టర్ డ్రైవర్గా పనిచేస్తున్నాడు.
రాజధానిని తరలించవద్దని గత 24 రోజులుగా రైతుల ఆందోళన ఉధృతంగా కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో రైతు కూలీ ఆత్మహత్య చేసుకోవడం స్థానికులను కలిచివేస్తోంది. ఇప్పటికే రాజధాని తరలిపోతుందనే ఆవేదనతో ఆరుగురు రైతులు గుండెపోటుతో మృతి చెందిన విషయం తెలిసిందే.