రాంచీ: జార్ఖండ్లో మూడో విడత ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. మూడో విడతలో భాగంగా 17 నియోజకవర్గాల్లో పోలింగ్ జరుగుతోంది. మొత్తం 306 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. రాంచీ, హతియా, కాంకె, బర్కతా, రామ్గర్ ప్రాంతాల్లో ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు పోలింగ్ జరగనుండగా.. సమస్యాత్మక ప్రాంతాలైన మిగతా నియోజకవర్గాల్లో మధ్యాహ్నం మూడు గంటల వరకే పోలింగ్ జరగనుంది. మొత్తం 56,18,267 మంది ఓటర్లు మూడో విడతలో ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ఇందులో 26,80,205మంది మహిళా ఓటర్లు కాగా.. 86మంది థర్డ్ జెండర్ ఓటర్లు ఉన్నట్టు ఎన్నికల ప్రధాన అధికారి వినయ్ కుమార్ చౌబే తెలిపారు.
మొత్తం 81 శాసనసభ స్థానాలున్న జార్ఖండ్ లో ఐదు దశల్లో ఎన్నికలు నిర్వహిస్తున్నారు. నక్సల్స్ ప్రభావం ఎక్కువగా ఉన్న రాష్ట్రం కావడంతో ఐదు దశల్లో ఎన్నికలు నిర్వహించాలని ఈసీ నిర్ణయించింది. అసెంబ్లీ ఎన్నికల మొదటి విడత పోలింగ్ నవంబర్ 30న, రెండో విడత పోలింగ్ డిసెంబర్ 7న జరగింది. ఇవాళ మూడో విడత పోలింగ్ జరగనుండగా.. నాలుగో విడత డిసెంబర్ 16, ఐదో విడత డిసెంబర్ 20న జరగనుంది. డిసెంబరు 23న ఫలితాలు వెల్లడించనున్నారు.
#JharkhandAssemblyPolls: Former Union Minister & BJP MP Jayant Sinha at a polling booth in Hazaribagh to cast his vote. Polling is underway in 17 constituencies in the state for the third phase of elections. pic.twitter.com/UVdxfmKv2o
— ANI (@ANI) December 12, 2019