(న్యూస్ ఆర్బిట్ డెస్క్)
తెలంగాణ సీఎం కేసీఆర్ ఢిల్లీ వెళితే బీజేపీ పెద్దల కాళ్లు మొక్కుతారని, హైదరాబాద్ రాగానే వారిని తిడతారని అదిలాబాద్ ఎంపీ సోయం బాబూరావు అన్నారు. కేంద్రం నిధులు ఇవ్వకుంటే ఒక్క క్షణం కూడా ప్రభుత్వం నడపలేని స్థితిలో కేసీఆర్ ప్రభుత్వం ఉందని విమర్శించారు. అయినా కేసీఆర్ లో భేషజానికి లోటులేదని ఎద్దేవా చేశారు. దీన్ని గుర్తించే తాను సీఎంకు అపాయింట్ మెంట్ ఇవ్వవద్దని ప్రధానిని కోరినట్లు చెప్పారు. తెలంగాణ రాష్ట్రం ఆర్థికంగా దివాలా స్థితిలో ఉందని, ఆ పరిస్థితుల్లోనూ కేంద్రం ఇచ్చే నిధులు దుర్వినియోగం చేస్తున్నారని ఆరోపించారు. కేసీఆర్ ఒంటెద్దు పోకడలతో రాష్ట్రం సర్వనాశనం అవుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ సత్తా చాటుతుందని, తెలంగాణలో త్వరలో బీజేపీ జెండా ఎగరడం ఖాయమని సోయం జోస్యం చెప్పారు.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?