విజయవాడ: ఆంధ్రప్రదేశ్ లో 25 జిల్లాలు ఏర్పాటు చేయాలనే ఆలోచనలో సీఎం జగన్ ఉన్నారని, రాష్ట్రాభివృద్ధే లక్ష్యంగా ఏపీ ప్రభుత్వం పలు నిర్ణయాలు తీసుకుంటోందని వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి చేసిన ప్రకటనపై టీడీపీ ఎంపీ కేశినేని నాని విమర్శనాస్త్రాలు సంధించారు. రాష్ట్రమంతా అభివృద్ధి జరగాలంటే కొత్తగా ఏర్పడే 25 జిల్లాల్లో 25 రాజధానులు పెట్టాలని వ్యాఖ్యానించారు.
‘జగన్ గారూ మీరు కోరుకుంటున్నట్లు రాష్ట్రమంతా అభివృద్ధి జరగాలంటే కొత్తగా ఏర్పడే 25 జిల్లాల్లో జిల్లాకి ఒక్కటి చొప్పున 25 రాజధానులు పెడితే బాగుంటుందేమో ఆలోచించండి’ అంటూ ఎద్దేవా చేస్తూ కేశినేని నాని ట్వీట్ చేశారు.
జగన్ గారూ@ysjagan మీరు కోరుకుంటున్నట్లు రాష్ట్రమంతా అభివృధి చెందాలంటే కొత్తగా ఏర్పడే 25 జిల్లాలలో జిల్లాకి ఒక్కటి చప్పున 25 రాజధానులు పెడితే బాగుంటుందేమో ఆలోచించండి. pic.twitter.com/Bq6lbD1Qgu
— Kesineni Nani (@kesineni_nani) December 22, 2019
కాగా, శనివారం విశాఖపట్నంలో నిర్వహించిన సీఎం జగన్ జన్మదిన వేడుకల్లో పాల్గొన్న వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రంలో అన్ని జిల్లాలను అబివృద్ధి చేయాలనే ఉద్దేశంతోనే మూడు రాజధానుల ప్రతిపాదన తీసుకొచ్చామని చెప్పారు. ‘రాష్ట్రంలో ప్రస్తుతం 13 జిల్లాలు ఉన్నాయి.. త్వరలో 25 జిల్లాలు కాబోతున్నాయి’ అని ప్రకటించిన సంగతి తెలిసిందే.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?