జగిత్యాల: తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో టీఆర్ఎస్ దూసుకుపోతోంది. 120 మున్సిపాలిటీల పరిధిలోని అనేక వార్డుల్లో ఇప్పటికే విజయం సాధించగా.. పలు చోట్ల ఆధిక్యంలో కొనసాగుతోంది. కాంగ్రెస్ పార్టీ కూడా గట్టి పోటి ఇస్తోంది. జగిత్యాల జిల్లాలో ధర్మపురి మునిసిపాలిటీలో పోటీ టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల మధ్య హోరాహోరీగా సాగింది. మొత్తం 15 వార్డుల్లో టీఆర్ఎస్ 8, కాంగ్రెస్ 7వార్డుల్లో గెలుపొందాయి. మంత్రి కొప్పుల ఈశ్వర్ ధర్మపురి నుంచే ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఒక్కవార్డు తేడాతో అతి కష్టం మీద టీఆర్ఎస్ కైవసం చేసుకుంది. ఇద్దరిని లాగేసుకునేందుకు రెండు పార్టీలు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాయి. అయితే, అభ్యర్థులు మాత్రం అందుబాటులో ఉండకుండా ఫోన్లు స్విచ్ఛాఫ్ చేశారు. దీంతో ఇరు పార్టీల నేతల్లో ఆందోళన నెలకొంది.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?