అమరావతి, మార్చి 18: రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి నోటిపికేషన్ విడుదల అయ్యింది.
రాష్ట్రంలో 175 శాసనసభ, 25 పార్లమెంట్ నియోజకవర్గాల ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ను రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి గోపాలకృష్ణ ద్వివేది సోమవారం విడుదల చేశారు
జిల్లాల వారీగా తక్షణం నోటిపికేషన్ విడుదల చేయాలని జిల్లా కలెక్టర్లకు ద్వివేది ఆదేశించారు.
నేటి నుండి ఈ నెల 25వ తేదీ వరకూ ఉదయం 11గంటల నుండి మధ్యాహ్నం 3గంటల వరకూ నామినేషన్లు స్వీకరణ, 26వ తేదీ నామినేషన్ల పరిశీలన, నామినేషన్ల ఉపసంహరణకు తుది గడువు 28తేదీ. ఎప్రిల్ 11 పోలింగ్, మే 23 ఓట్ల లెక్కింపు, ఫలితాల వెల్లడి జరుగుతుందని గోపాలకృష్ణ ద్వివేది తెలిపారు.