హైదరాబాద్: గవర్నర్ తమిళిసై సౌందరరాజన్తో సీఎం కేసీఆర్ భేటీ అయ్యారు. కొత్త రెవెన్యూ చట్టం, ఆర్టీసీ ప్రైవేటీకరణ, అసెంబ్లీ సమావేశాలు సహా పలు అంశాలపై గవర్నర్తో సీఎం కేసీఆర్ చర్చించనున్నట్లు తెలుస్తోంది. ఆర్టీసీ సమ్మె వ్యవహారం, ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలపై ప్రధానంగా చర్చించనున్నట్లు సమాచారం. తమిళసై గవర్నర్గా ప్రమాణ స్వీకారం చేసిన మూడు నెలల తర్వాత సీఎం కేసీఆర్ ఆమెను కలుస్తుండటంతో ఈ భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది.
తెలంగాణలో 5,100 రూట్లను ప్రైవేటీకరిస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో… దీనిపై విధివిధానాలను ఖరారు చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది. సాధ్యమైనంత తొందరగా దీనిపై నిర్ణయం తీసుకోవాలని భావిస్తున్న ప్రభుత్వం… ఆర్టీసీ కార్మికులను తిరిగి విధుల్లో తీసుకునే అంశంపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో అనే అంశం ఆసక్తికరంగా మారింది.విధుల్లో చేరడానికి సిద్ధమని ఆర్టీసీ జేఏసీ ప్రకటించినా.. ప్రభుత్వం నుంచి స్పందన రాకపోవడంతో కార్మికుల్లో ఉత్కంఠ నెలకొంది. ఆర్టీసీపై సీఎం కేసీఆర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారోనని కార్మికులతోపాటు ప్రజలు కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. విధుల్లో చేరతామంటూ డిపోల ముందు బారులు తీరినా.. ప్రభుత్వం నుంచి తమకు ఎలాంటి ఆదేశాలు లేవంటూ అధికారులు నిరాకరిస్తుండటంతో కార్మికులు ఆందోళన చెందుతున్నారు.