పాట్నా: కమ్యూనిస్టు మేధావి, మాజీ ఎంపి ఎకె రాయ్ (90) ఆదివారం మధ్యాహ్నం కన్నుమూశారు. గత కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న రాయ్ జార్ఖండ్లోని ఒక ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. ధన్బాద్ నియోజకవర్గం నుండి మూడు సార్లు ఎంపిగా గెలిచారు.
జెఎంఎం అధినేత శిబూసొరెన్తో కలిసి 1971లో ప్రత్యకే రాష్ట్ర ఉద్యమాన్ని నడిపారు. 1967లో బిహార్లోని సింధ్రీ అసెంబ్లీ నియోజకవరం నుండి సిపిఎం అభ్యర్థిగా గెలుపొందారు.తరువాత ఆయన ఆ పార్టీ సిద్ధాంతాలతో విభేదించి మార్క్సిస్ట్ కో ఆర్డినేషన్ కమిటి అనే పార్టీని స్థాపించారు. దశాబ్దాల కాలం పాటు ఆయన పార్టీ కార్యాలయంలోనే నివాసం ఉన్నారు. గత కొద్ది నెలలుగా ఒక పార్టీ కార్యకర్త ఇంట్లో నివాసముంటున్నారు.