అమరావతి: మూడు రాజధానుల ప్రకటనపై రాజధాని అమరావతి ప్రాంతం అట్టుడుకుతోంది. అమరావతిలోనే రాజధాని కొనసాగించాలని డిమాండ్ చేస్తూ వరుసగా నాల్గవ రోజు ఆందోళనలు కొనసాగిస్తున్నారు. శనివారం వెలగపూడి గ్రామంలో పంచాయతీ కార్యాలయ భవనానికి ఉన్న వైసిపి రంగులను ఆ పార్టీ కార్యకర్తలే తుడిచి వేసి నల్లరంగు వేసి నిరసన తెలిపారు. పంచాయతీ భవనానికి నల్లరంగు వేస్తున్న వైసిపి కార్యకర్తలను పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేయగా గ్రామస్తులు వారికి మద్దతుగా నిలిచారు. పోలీసులను తోసి వేసి మరీ పంచాయయతీ కార్యాలయానికి నల్లరంగు వేశారు. ఈ సందర్భంలో పోలీసుల మీద నల్లరంగు పడింది. తమను పట్టించుకోని పార్టీ రంగులు పంచాయతీ కార్యాలయానికి ఎందుకని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు.సిఎం జగన్కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
previous post
next post