(న్యూస్ ఆర్బిట్ డెస్క్)
భారత మహిళా క్రికెట్ జట్టు కెప్టెన్ మిథాలీ రాజ్ కీలక నిర్ణయం తీసుకుంది. తాను అంతర్జాతీయ టీ20 నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించింది. ప్రపంచ మహిళా క్రికెట్లోనే అత్యధిక పరుగులు చేసిన మిథాలీ.. ఇప్పటి వరకు మిథాలీరాజ్ ఇండియా తరఫున 32 టీ-20మ్యాచ్లడారు. అందులో మూడు ప్రపంచకప్లకు ఆడడం విశేషం. 2021లో జరిగే వన్డే ప్రపంచకప్ కు పూర్తిస్థాయిలో అందుబాటులో ఉండేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు మిథాలీ తెలిపింది. భారత్ కు ప్రపంచకప్ సాధించిపెట్టడం తన కల అనీ, తనకు సహకరించిన బీసీసీఐకి ధన్యవాదాలు చెబుతున్నట్లు పేర్కొంది. అలాగే త్వరలోనే దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్ ఆడబోతున్న భారత జట్టుకు శుభాకాంక్షలు చెప్పింది.
మిథాలీరాజ్ తొలిసారి 2006లో ఇంగ్లాండ్ లోని డెర్బీలో మొదటి టీ20 మ్యాచ్ ఆడింది. ఆమె మూడు టీ20 ప్రపంచకప్ లు సహా 32 టీ20ల్లో భారత జట్టుకు నేతృత్వం వహించింది. తన కెరీర్ లో మొత్తం 88 టీ20 మ్యాచ్ లు ఆడిన మిథాలీ, 2,364 పరుగులు చేసింది. ఆమె చివరిసారిగా ఇంగ్లాండ్ జట్టుపై ఈ ఏడాది మార్చి 9న చిట్టచివరి టీ20 మ్యాచ్ ఆడింది.
Former India T20I captain, Mithali Raj, has announced her retirement from T20 Internationals. pic.twitter.com/G4QdIvRgo3
— ANI (@ANI) September 3, 2019