న్యూఢిల్లీ: దేశంలో చట్టాల కంటే రాజకీయ దురద్దేశాలు బలమైనవిగా మారిపోతున్నాయని కర్ణాటక మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత డీకే శివకుమార్ అన్నారు. మనీలాండరింగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆయనను.. 9 రోజుల కస్టడీకి అప్పగిస్తూ బుధవారం ఈడీ కోర్టు తీర్పు చెప్పింది. ఈ సందర్భంగా ఆయన ఓ వీడియోను ట్విటర్ లో పోస్ట్ చేశారు. “రాజకీయ కక్షసాధింపు దేశంలోని చట్టాలకన్నా ఎంతో బలమైనది” అని వ్యాఖ్యానించారు.
Political Vendetta has become more stronger than the law in this country pic.twitter.com/Ylo7QhBkKn
— DK Shivakumar (@DKShivakumar) September 4, 2019
మనీలాండరింగ్ కేసులో డీకే శివకుమార్ ను మంగళవారం ఈడీ అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. బుధవారం ఆయనను ఢిల్లీలోని ఈడీ కోర్టులో హాజరుపరిచారు. డీకే తరుపున అభిషేక్ సింఘ్వి, ఈడీ తరుపున అదనపు సొలిసిటర్ జనరల్ కే.ఎం.నటరాజ్ వాదనలు వినింపిచాంరు. ఈడీ కస్టడీ విషయంలో ప్రత్యేక న్యాయస్ధానంలో వాడీవేడీ వాదనలు జరిగినా ప్రయోజనం లేకపోయింది. శివకుమార్ను ఈడీ అధికారులు టార్చర్ చేశారని, బుధవారం కనీసం భోజనం కూడా పెట్టలేదని, ఆయననుక 14 రోజుల కస్టడీకి అప్పగిస్తే మరింత ఇబ్బందిపెడతారని శివకుమార్ న్యాయవాదులు వాదించారు. డీకే ఇప్పటికే ఛాతీ నొప్పితో బాధపడుతున్నారు. అయినప్పటికీ ఆయనను హాస్పిటల్ నుంచి కోర్టుకు నేరుగా తీసుకొచ్చారు. ఆయన తరపున అభిషేక్ సింఘ్వీ కేసును వాదించారు.
అయితే, సింఘ్వీ వాదనతో ఈడీ తరపు న్యాయవాదులు విభేదించారు. శివకుమార్ ఐటీ చట్టాలను ఉల్లంఘించారని, ఆయన మనీల్యాండరింగ్కు పాల్పడ్డారని ఆరోపిస్తూ శివకుమార్ను లోతైన విచారణ జరపాలని న్యాయస్ధానంలో వాదించారు. ఇరువురి వాదనలు విన్న న్యాయమూర్తి అజయ్ కుమార్.. ఈ నెల 13 వరకు శివకుమార్ ను ఈడీ కస్టడీలో ఉంచాలని ఆదేశించారు. బెయిల్ కోరుతూ డీకే శివకుమార్ సమర్పించిన పిటిషన్ పై ఆదే రోజు విచారిస్తామని స్పష్టం చేశారు. అయితే కస్టడీలో ఉన్నప్పటికీ డీకే..తన కుటుంబ సభ్యులను కలుసుకనే వీలు కల్పించారు.