హైదరాబాద్: ప్రియాంక రెడ్డి ఘటన మరవకముందే శంషాబాద్ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో మరో ఘాతకం వెలుగు చూసింది.
సిద్దులగుట్ట రోడ్డులో అయ్యప్ప ఆలయం పక్కన సుమారు 35 సంవత్సరాల మహిళను దుండగులు హత్య చేసి, మృత దేహానికి నిప్పు పెట్టి పరారయ్యారు. ఆ సమీపంలో వెళుతున్న యువకులు మంటల్లో యువతి కాలుతున్న దృశాన్ని చూసి 100 నెంబర్ కు కాల్ చేశారు.
పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని అనుమానాస్పద మృతిగా కేసును నమోదు చేసి దర్యాప్తును చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియరాలేదు.
రోజుల వ్యవధిలో ఇద్దరు మహిళలు దుండగుల ఘాతుకానికి బలి అవ్వడం ఆ ప్రాంత వాసులను ఆందోళనకు గురిచేస్తున్నది.