(న్యూస్ ఆర్బిట్ డెస్క్)
ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న తిరుమల తిరుపతి దేవస్థానం ట్రస్టు బోర్డు సభ్యులను ప్రభుత్వం ప్రకటించింది. అధికారంలోకి రాగానే మాజీ ఎంపీ వైవి సుబ్బారెడ్డిని టిటిడి పాలకమండలి ఛైర్మన్గా నియమించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలకమండలి సభ్యుల నియామకానికి కాస్త సమయం తీసుకున్నారు. ఎక్స్ అఫీషియో సభ్యులతో కలిపి పాలకమండలిలో మొత్తం 28మంది సభ్యులు ఉంటారు. పొరుగు రాష్ట్రమైన తెలంగాణ నుంచి ఏడుగురు సభ్యులను నియమించడం ఈసారి విశేషం. ఆంధ్రప్రదేశ్ నుంచి ఎనిమిది మంది, కర్నాటక నుంచి ముగ్గురు, తమిళనాడు నుంచి నలుగురు, ఢిల్లీ నుంచి ఒకరు, మహారాష్ట్ర నుంచి ఒకరిని పాలకమండలిలో సభ్యులుగా నియమించారు.
ఆంధ్రప్రదేశ్ నుండి..
- వి. ప్రశాంతి,
- యువి రమణమూర్తి,
- మల్లిఖార్జున రెడ్డి,
- గొల్ల బాబారావు
- నాదెండ్ల సుబ్బారావు,
- డిపి అనంత,
- చిప్పగిరి ప్రసాద్ కుమార్
- కె పార్ధసారధి
తెలంగాణ నుండి
- జె రామేశ్వరరావు
- బి పార్థసారధి రెడ్డి
- యు వెంకట భాస్కరరావు
- మూరంశెట్టి రాములు
- డి దామోదరరావు
- కె శివకుమార్
- పుట్టా ప్రతాప్ రెడ్డి
కర్నాటక నుండి
- రమేష్ శెట్టి
- సంపత్ రవి నారాయణ
- సుధా నారాయణమూర్తి
తమిళనాడు నుండి
- కృష్ణమూర్తి వైద్యనాధన్
- ఎస్ శ్రీనివాసన్
- డాక్టర్ నిశ్చిత ముత్తవరపు
- కుమారగురు
మహారాష్ట్ర నుండి
- రాజేష్ శర్మ
ఢిల్లీ నుండి
- ఎంఎస్ శివశంకరన్
ఎక్స్ అఫిషియో సభ్యులు
- తుడా చైర్మన్
- స్పెషల్ చీఫ్ సెక్రటరీ
- దేవాదాయ శాఖ కమిషనర్
- టిటిడి ఇఒ