న్యూఢిల్లీ: పౌరసత్వ చట్ట సవరణకు వ్యతిరేకంగా ఢిల్లీలో చేపట్టిన నిరసనలు మరోమారు హింసాత్మకంగా మారాయి. జామియా మిలియా యూనివర్శిటీలో జరిగిన అల్లర్ల వేడి ఇంకా చల్లారకముందే ఈస్ట్ ఢిల్లీలో నిరసనకారులు రెచ్చిపోయారు. మంగళవారం సీలంపూర్ ప్రాంతంలో శాంతియుతంగా ప్రారంభమైన నిరసన ర్యాలీ హింసకు దారి తీసింది. నిరసన ర్యాలీలో పాల్గొన్న దాదాపు రెండు వేల మంది ఆందోళనకారులు పోలీసుల పైకి రాళ్లు రువ్వారు. ఓ పోలీస్ బూత్తో పాటు రెండు బస్సులను తగలబెట్టారు. పౌరసత్వ నమోదు చట్టానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఆందోళనకారులు పోలీసులపై రాళ్ల దాడికి పాల్పడ్డారు. ఈ సందర్భంగా ఇద్దరు పోలీసులకు తీవ్ర గాయాలు అయ్యాయి. నిరసనకారులను అదుపు చేసేందుకు పోలీసులు టియర్ గ్యాస్ ప్రయోగించారు. పలువురు ఆందోళనకారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఘటనా స్థలికి అదనపు బలగాలను రప్పించారు. ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో సీలంపూర్తో పాటు జఫ్రాబాద్,మౌజ్పూర్-బాబర్పూర్ మెట్రో స్టేషన్లను తాత్కాలికంగా మూసివేశారు. రోడ్లపై ఉన్న కార్లను కొంతమంది యువత రాళ్లతో ధ్వంసం చేశారు.
#WATCH Delhi: Police take away protesters from the spot where a clash broke out between police and protesters, during protest against #CitizenshipAmendmentAct today. Police has also used tear gas shells to disperse the protesters. pic.twitter.com/DkPGAEQ1tM
— ANI (@ANI) December 17, 2019
#WATCH Delhi: Earlier visuals of protesters targeting policemen in Seelampur. #CitizenshipAmendmentAct pic.twitter.com/JPJLub29ln
— ANI (@ANI) December 17, 2019
పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా ఆదివారం(డిసెంబర్ 15) సాయంత్రం న్యూ ఫ్రెండ్స్ కాలనీ సమీపంలో జేఎంఐ విద్యార్థులు, స్థానికులు ఉమ్మడిగా చేపట్టిన ఆందోళన హింసాత్మకంగా మారిన సంగతి తెలిసిందే. తొలుత ఆందోళనకారులు నాలుగు బస్సులకు నిప్పంటించారు. వారిని అదుపుచేసే క్రమంలో ఆరుగురు పోలీసులు, ఇద్దరు అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా గాయపడ్డారు. కొందరు పోలీసులతో ఘర్షణకు దిగారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు ఆందోళనకారులపై లాఠీఛార్జీ చేసి, టియర్ గ్యాస్ ప్రయోగించారు. ఇదే అల్లర్లలో జామియా యూనివర్శిటీకీ చెందిన పలువురు విద్యార్ధులు కూడా గాయాలపాలయ్యారు.