అమరావతి: ఏపి అధికార భాషా సంఘం అధ్యక్షుడు యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీషు మాధ్యమం ఏర్పాటు అంశంలో యుటర్న్ తీసుకోవడాన్ని నెటిజన్లు విమర్శిస్తున్నారు.
టిడిపి హయాంలో ఇంగ్లీష్ మీడియంను ఒక ఇచ్చికంగా అదీ కూడా పురపాలిక పాఠశాలల్లో పెడతామంటే ఆంధ్రప్రదేశ్ను ఆంగ్లప్రదేశ్గా చేస్తారా అంటూ యార్లగడ్డ ప్రభుత్వాన్ని విమర్శించారు. నాడు తెలుగు భాషాభిమానులు పలు ప్రాంతాల్లో ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ నిరసన కార్యక్రమాలను సైతం నిర్వహించారు. నాటి నిరసన కార్యక్రమాల్లో యార్లగడ్డ పాల్గొన్నారు కూడా. ఇప్పుడు జగన్మోహనరెడ్డి ప్రభుత్వం రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో వచ్చే ఏడాది నుండి నిర్బంధ ఇంగ్లీష్ మీడియం విద్యాబోధన ప్రవేశపెడుతుంటే ప్రజల కోరిక మేరకు జరుగుతోందని యార్లగడ్డ పేర్కొంటున్నారు. జగన్మోహనరెడ్డి పాదయాత్రలో ప్రజల కోరిక మేరకు హామీ ఇచ్చారని, ఆ హామీని నేడు నెరవేరుస్తున్నారనీ యార్లగడ్డ చెబుతున్నారు.
నాడు, నేడు యార్లగడ్డ ఏమి మాట్లాడారో మీరు చూడండి.
తెదేపా హయాంలో ఇంగ్లీష్ మీడియంను ఒక ఐచ్చికంగా.. అది కూడా పురపాలిక పాఠశాలల్లో పెడతామంటే ఆంధ్రప్రదేశ్ ను ఆంగ్ల ప్రదేశ్ గా చేస్తారా? అని ఆందోళన చేసారు కొందరు. మరి ఈరోజు రాష్ట్రమంతా ఇంగ్లీష్ మీడియం అంటే అంతా ప్రజల కోరిక మేరకు జరిగిందని సర్ది చెప్పుకుంటున్నారు. pic.twitter.com/tCLNvuVBsf
— YSR ఆత్మని… (@FWbBsGeq2t1QCB2) November 9, 2019