న్యూఢిల్లీ: ‘మహాత్మా గాంధీ హత్య కేసును ఇవాళ సుప్రీంకోర్టు విచారిస్తే నాధూరాం గాడ్సే హంతకుడు అయితే దేశభక్తుడు కూడా అని తీర్పు చెప్పిఉండేది’: అయోధ్య వివాదంపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుకు మహాత్ముడి మునిమనుమడు తుషార్ గాంధీ స్పందన ఇది.
2.77 ఎకరాలు వివాద స్థలంలో రామమందిరం నిర్మించడానికి దానిని రామజన్మభూమి ట్రస్టుకు అప్పగించాలని ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయ్ నేతృత్వంలోని అయిదుగురు సభ్యుల సుప్రీంకోర్టు ధర్మాసనం శనివారం ఏకగ్రీవంగా తీర్పు చెప్పింది. వివాదస్థలం వెలుపల మసీదు నిర్మించేందుకు అయిదు ఎకరాల స్థలాన్ని ముస్లింలకు అప్పగించాలని కూడా ధర్మాసనం ఆదేశించింది.
దీనిపై స్పందిస్తూ తుషార్ గాంధీ ట్వీట్ చేశారు. ‘అందరినీ సంతృప్తి పరచడం న్యాయం చెయ్యడం కాదు. అందరినీ సంతృప్తి పరచడం రాజకీయం చెయ్యడం’ అని కూడా ఆయన ట్వీట్ చేశారు. అయోధ్య తీర్పు తర్వాత దేశాన్ని పట్టిపీడిస్తున్న అసలైన సమస్యల గురించి ఆలోచిద్దామా అని తుషార్ గాంధీ వ్యాఖ్యానించారు.
If the Gandhi Murder case was retried by the Supreme Court today, the verdict would have been Nathuram Godse is a Murderer but he is also a Desh Bhakt.
— Tushar (@TusharG) November 9, 2019