హైదరాబాద్:అయోధ్య కేసులో సుప్రీం కోర్టు తీర్పును బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ స్వాగతించారు. సుప్రీం తీర్పు చారిత్రాత్మకమని, అయోధ్యలో రామ మందిరం కడతామని చెప్పారు. మందిర నిర్మాణానికి హిందువులకు ముస్లింలు సహకరించాలని కోరారు. రామమందిరం అంశంపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును ఇరువర్గాల ప్రజలు అంగీకరిస్తున్నారని తెలిపారు. సుప్రీం కోర్టు తీర్పు నేపథ్యంలో దేశంలో శాంతి నెలకొనాల్సిన అవసరం ఉందన్నారు. బీజేపీ ఏదైనా చెబితే.. అది చేసి చూపిస్తుందన్నారు. బీజేపీ ఎన్నికల మ్యానిఫెస్టోలో అయోధ్యలో రామమందిరం కడతామని, కశ్మీర్ స్వయం ప్రతిపత్తికి సంబంధించిన 370 ఆర్టికల్ను రద్దు చేస్తామని హామీ ఇచ్చామని గుర్తు చేశారు. ఇక మిగిలింది పీవోకే మాత్రమేనని చెప్పారు. ఇప్పటికే ఆర్టికల్ 370ని రద్దు చేశామని, ఇక బీజేపీ తదుపరి టార్గెట్ పీవోకేనని చెప్పారు. పాక్ అక్రమిత కశ్మీర్ ఎప్పటికీ భారత్ లో అంతర్భాగమేనని, పీవోకేలో భారతీయ జెండా ఎగురవేస్తామని రాజాసింగ్ వ్యాఖ్యానించారు.
previous post
next post