(న్యూస్ ఆర్బిట్ బ్యూరో)
అమరావతి: శాసనసభ, శాసనమండలిలో ఇటీవల జరిగిన పరిణామాలపై గవర్నర్ బిశ్వభూషన్ హరిచందన్ ఆరా తీసినట్లు తెలుస్తోంది. శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారాం నిన్న గవర్నర్తో భేటీ అయ్యారు. నేడు శాసనమండలి చైర్మన్ షరీఫ్ గవర్నర్తో సమావేశం కావడం ప్రాధాన్యతను సంతరించుకొన్నది. శాసనసభలో ఆమోదం పొందిన సిఆర్డిఎ రద్దు, వికేంద్రీకరణ బిల్లులపై శాసనమండలిలో అధికార విపక్ష వర్గీయుల మధ్య ఘర్షణ, బిల్లులను సెలెక్ట్ కమిటీకి పంపడం తెలిసిందే. ఈ నేపథ్యంలో టిడిపి అధినేత చంద్రబాబు గవర్నర్ను కలిసి జరిగిన పరిణామాలపై వినతి పత్రం సమర్పించారు. ఆ తరువాతే అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం, మండలి చైర్మన్ షరీఫ్లు విడివిడిగా గవర్నర్తో భేటీ అయ్యారు. అసెంబ్లీలో, కౌన్సిల్లో జరిగిన పరిణాల గురించి తమ్మినేని, షరీఫ్లు ఆయన వివరించినట్లు తెలుస్తోంది.