కాకినాడ: వైసీపీ దాడుల్లో గాయపడ్డ జనసేన కార్యకర్తలను పరామర్శించేందుకు కాకినాడకు వస్తున్న జనసేన అధినేత పవన్ కల్యాణ్ కాన్వాయ్ ని పోలీసులు అడ్డుకున్నారు. ఈ నేపథ్యంలో కాకినాడలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. రెండ్రోజులుగా ఢిల్లీ పర్యటనలో బిజిబిజీగా ఉన్న పవన్ మంగళవారం కాకినాడ పర్యటన వచ్చారు. విశాఖ విమానాశ్రయం నుంచి రోడ్డుమార్గంలో కాకినాడకు వస్తున్న పవన్ కల్యాణ్ కాన్వాయ్ ని పోలీసులు అడ్డుకున్నారు. పవన్ పర్యటనను అడ్డుకోబోమని, ఆయనను అరెస్ట్ చేయబోమని జిల్లా ఎస్పీ నయీం హస్మీ ప్రకటించినప్పటికీ… పవన్ ను పోలీసులు అడ్డుకోవడంతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది.
మరోవైపు పవన్ పర్యటన నేపథ్యంలో కాకినాడలో 144 సెక్షన్ విధించారు. పవన్ను కలిసేందుకు జిల్లా నలుమూలల నుంచి అభిమానులు, కార్యకర్తలు తరలివస్తున్నారు.