అమరావతి: టీడీపీ అధినేత చంద్రబాబు నిర్వహించిన ప్రెస్ కాన్ఫరెన్స్ సంతాప సమావేశంలా ఉందని వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి అన్నారు. చంద్రబాబుపై ట్విట్టర్ వేదికగా విజయసాయిరెడ్డి విమర్శలు గుప్పించారు. ‘మీరు అంత నిప్పు, పత్తి గింజ అయితే అమరావతిలో ఇన్ సైడర్ ట్రేడింగ్ జరగనే లేదు. మా అందరికీ ఒకేసారి కల వచ్చి 4 వేల ఎకరాల భూములను కొనుగోలు చేశామని చెప్పండి. దీనిపై దర్యాప్తు జరిపి, మాపై పడిన నిందను తొలగించమని సీబీఐని కోరండి’ అని ట్వీట్ చేశారు. మీరు ఏమీ చేయకపోతే ఎందుకంత భయపడుతున్నారని ప్రశ్నించారు.
‘రాజధాని కోసం చంద్రబాబు మార్కెటింగ్ మేనేజర్ అవతారం ఎందుకెత్తారో ఢిల్లీ మీడియా వర్గాలకు అప్పట్లో అంతుబట్టలేదు. రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసమని ఇప్పుడర్థమైంది. ప్రజా ధనంతో దేశాలు తిరిగి అమరావతిపై ప్రెజెంటేషన్లిచ్చాడు. పెట్టుబడుల కోసమైతే వెనకబడిన జిల్లాల గురించి ప్రస్తావించొచ్చు కదా?’ అని మరో ట్విట్ చేశారు.
https://twitter.com/VSReddy_MP/status/1210800098696781826
. @ncbn ప్రెస్ కాన్ఫరెన్సు సంతాప సమావేశంలా ఉంది. మీరు అంత నిప్పు, పత్తి గింజ అయితే ఇన్ సైడర్ ట్రేడింగ్ జరగనే లేదు. మా అందరికీ
ఒకేసారి కల వచ్చి 4 వేల ఎకరాల భూములు కొనుగోలు చేశామని చెప్పండి. దీనిపై దర్యాప్తు చేసి మాపై పడిన నింద తొలగించమని సిబిఐని కోరండి. ఏం లేకపోతే మీకెందుకు భయం.— Vijayasai Reddy V (@VSReddy_MP) December 28, 2019