అమరావతి: సెలక్ట్ కమిటీ ఏర్పాటు దస్త్రాన్ని వెనక్కి పంపండంపై శాసనమండలి చైర్మన్ షరీఫ్ మండలి కార్యదర్శిపై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. సెలక్ట్ కమిటీకి సంబంధించి చైర్మన్ ఇచ్చిన ఉత్తర్వులు పున:సమీక్షించాలని మండలి కార్యదర్శి ఫైల్ను వెనక్కి పంపిన విషయం తెలిసిందే.
రూల్ నెంబర్ 154 కింద తనకు సంక్రమించిన విచక్షణాధికారాల మేరకు సెలక్ట్ కమిటీని నియమించినట్లు చైర్మన్ షరీఫ్ పేర్కొన్నారు. దీనికి సంబంధించి ఓటింగ్ సాధ్యంకాదని స్పష్టం చేశారు. సెలెక్ట్ కమిటీని నియమించి, దానికి సంబంధించి ఫైల్ను వెంటనే పంపని పక్షంలో అందులో ఉండే నిబంధనల ప్రకారం చర్యలు తీసుకుంటామని చైర్మన్ హెచ్చరించినట్లు తెలుస్తోంది.
ఈ మేరకు బుధవారం రాత్రి ఈఫైలింగ్ సిస్టం ద్వారా సెక్రటరీకి షరీఫ్ నోట్ పంపినట్లు సమాచారం. దీనిపై మండలి కార్యదర్శి ఏవిదంగా స్పందిస్తారనేది ఆసక్తి కరంగా మారింది.