అమరావతి: మూడు రాజధానుల నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ అమరావతి ప్రాంత రైతులు చేపట్టిన ఆందోళనలు 58వ రోజుకు చేరుకున్నాయి. మందడం, తుళ్లూరు గ్రామాల్లో ధర్నాకు దిగారు. వెలగపూడిలో 58వ రోజు రిలే దీక్ష లు కొనసాగుతున్నాయి. ఇతర రాజధాని గ్రామాల్లోనూ రైతులు తమ ఆందోళనలు కొనసాగిస్తున్నారు. ఈ రోజు మందడం, వెలగపూడి గ్రామాల్లోనూ 24 గంటల పాటు రైతులు దీక్షలకు దిగారు. తుళ్లూరు గ్రామంలో 151 మంది అసైన్డ్ రైతులు దీక్షలో కూర్చున్నారు. మూడు రాజధానులు వద్దు, ఒక్క రాజధాని ముద్దు, రాజధాని ఒకే చూట ఉండాలి, అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలి, పరిపాలన వికేంద్రీకరణ కాదు అంటూ రైతులు, మహిళలు నినదిస్తున్నారు.
మరో పక్క పలు జిల్లాలలో వైసీపీ అధ్యర్యంలో మూడు రాజధానులను స్వాగతిస్తూ ప్రదర్శనలు, వంటా వార్పు, ర్యాలీలు నిర్వహిస్తున్నారు.