(న్యూస్ ఆర్బిట్ డెస్క్)
ఆమె ఓ ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లీష్ టీచర్. కానీ ఇంగ్లీష్ చదవడం రాదు. కష్టపడి చదివి తన ప్రతిభతో ఉద్యోగం సంపాదించుకుందో, లేకపోతే వేరే మార్గంలో కొలువు కొట్టేసిందో తెలియదు గాని సదరు టీచరమ్మ ఇంగ్లీష్ పాఠ్యపుస్తకంలోని పేజీలో కనీసం ఒక్క లైను కూడా చక్కగా చదవలేకపోయింది. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన పైఅధికారి ఆమెను ఉన్నపళంగా సస్పండ్ చేసి ఇంటికి సాగనపంపారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
#WATCH Unnao: An English teacher fails to read a few lines of the language from a book after the District Magistrate, Devendra Kumar Pandey, asked her to read during an inspection of a govt school in Sikandarpur Sarausi. (28.11) pic.twitter.com/wAVZSKCIMS
— ANI UP (@ANINewsUP) November 30, 2019
వివరాల్లోకి వెళితే.. ఉత్తరప్రదేశ్లోని సికందర్పూర్ సరౌసిలోని ప్రభుత్వ పాఠశాలలో గురువారం(నవంబర్ 28) జిల్లా మెజిస్ట్రేట్ దేవేంద్ర కుమార్ పాండే స్కూల్లో ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఓ తరగతి గదిలోకి వెళ్లిన ఆయన ఇంగ్లిష్ పాఠ్యపుస్తకం తీసి అందులోని రెండు లైన్లు చెప్పి చదవాలని విద్యార్థులను కోరారు. చదివేందుకు వారు కష్టపడుతుండడంతో ఆ పుస్తకాన్ని నేరుగా వారికి పాఠాలు చెప్పే ఇంగ్లిష్ టీచర్కు ఇచ్చి చదవమన్నారు. ఆ పుస్తకాన్ని తీసుకున్న టీచర్ గుటకలు మింగడాన్ని మేజిస్ట్రేట్ గమనించారు. వాజ్.. నో.. అంటూ ఆమె ముక్కి మూల్గింది. ఒక్క లైను కూడా చదవలేక చేతులెత్తేయడంతో మేజిస్ట్రేట్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తానేమీ అనువదించమనలేదని, కేవలం చదివి చెప్పమని మాత్రమే అన్నానంటూ ఆమెపై మండిపడ్డారు. ఇంగ్లీష్ టీచర్ కి ఇంగ్లీష్ రాకపోవడాన్ని మేజిస్ట్రేట్ తీవ్రంగా పరిగణించారు. చదువురాని టీచరమ్మ పిల్లలకు ఏం బోధిస్తుంటూ ఆమెను వెంటనే ఉద్యోగం నుంచి సస్పెండ్ చేయాలని ఆదేశించారు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.