లక్నో: అయోధ్య భూ వివాదంపై సుప్రీం ధర్మాసనం ఇచ్చిన తీర్పుపై రివ్యూ పిటిషన్ దాఖలు చేయాలని ఆఖిల భారత ముస్లిం పర్సనల్ లా బోర్డు నిర్ణయించింది. అయోధ్య తీర్పుపై సమీక్షించేందుకు ఆదివారం లక్నోలో ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు మీటింగ్ జరిగింది. ఈ సమావేశం అనంతరం జమైత్ ఉలేమా ఎ హింద్ అధ్యక్షుడు మౌలానా అర్షద్ మదాని మీడియాతో మాట్లాడారు. తమ పిటిషన్ను నూరు శాతం తిరస్కరిస్తారని తెలిసినప్పటికీ రివ్యూ పిటిషన్ దాఖలు చేయాలనే నిర్ణయించినట్లు మదాని స్పష్టం చేశారు.