అమరావతి: రాయలసీమలోనే మానవహక్కుల ఉల్లంఘన అధికంగా ఉన్నదని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. రాయలసీమలోని పరిస్థితులను పవన్ కళ్యాణ్ ట్విట్టర్ వేదికగా వివరించారు.
1996లో ఆంధ్రప్రదేశ్ పౌరహక్కుల సంఘం ‘కడప జిల్లాలో పాలెగాళ్ల రాజ్యం’ అనే పుస్తకాన్ని ప్రచురించిందని పవన్ పేర్కొన్నారు. ఈ పుస్తకంలో అనేక చేదు నిజాలు బయటకి వచ్చాయన్నారు. రాయలసీమ నుండి ఎంతో మంది ముఖ్యమంత్రులు వచ్చినప్పటికీ దళిత, వెనుకబడిన, మిగతా అన్ని కులాల సామాన్య ప్రజలు ఈ ముఠా సంస్కృతి వలన ఎలా నలిగి, వలసలు వెళ్లిపోతున్నారు. రాయలసీమ వెనుకబాటుకు కారణాలు ఏంటో అవగతమవుతుందని పవన్ అన్నారు. ఈ పుస్తకంలో 75వ పేజీలో జగన్ రెడ్డి గారి ప్రస్తావన కూడా ఉందని పేర్కొన్నారు.
దళిత కులాల మీద దాడులు జరిగినా బయటకి వచ్చి చెప్పడానికి భయపడతారనీ, ఇంకా మిగతా వారు ముఠాలు చెప్పింది మౌనంగా వినటమేననీ ఆయన వివరించారు. పోరాట యాత్ర సమయంలో ఒక యువతి ఆమె బాధను వెళ్లపోసుకుంటుంటే తన గుండే కలచివేసిందని పవన్ అన్నారు.
రాయలసీమలోనే మానవహక్కుల ఉల్లంఘన అధికంగా ఉన్నది అనడానికి కర్నూలులోని ఒక రెసిడిన్షియల్ స్కూల్ విద్యార్థిని సుగాలి ప్రీతి ఉదంతమే ఉదాహరణ అని పవన్ పేర్కొన్నారు.
అలాగే ఈ పుస్తకంలో 75వ పేజీలో
శ్రీ జగన్ రెడ్డి గారి ప్రస్తావన కూడా ఉంటుంది.— Pawan Kalyan (@PawanKalyan) November 25, 2019
మానవ హక్కుల ఉల్లంఘన అధికంగా ఉన్నది ‘ రాయల సీమ లోనే,దళిత కులాల మీద దాడులు జరిగిన, బయటకి వచ్చి చెప్పటానికి భయపడతారు. ఇంకా మిగతా వారు ముఠాలు చెప్పింది ,మౌనంగా వినటమే. పోరాట యాత్రలో నన్ను యువత కలిసి వారి బాధలు వెళ్లపోసుకుంటుంటే నా గుండె కలిచి వేసింది.
— Pawan Kalyan (@PawanKalyan) November 25, 2019