న్యూఢిల్లీ: మహారాష్ట్ర రాజకీయ సంక్షోభం పార్లమెంట్ను తాకింది. మహారాష్ట్రలో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు. ‘నేను ఓ ప్రశ్న అడగాలని అనుకున్నాను. కానీ, మహారాష్ట్రలో ప్రజాస్వామ్యం ఖూనీ అయింది. దీనిపై ప్రశ్నించేందుకు కూడా అనువైన పరిస్థితులు లేవు’ అని అన్నారు. అంతకుముందు సభాపతి పోడియం చుట్టుముట్టి విపక్ష నేతలు నినాదాలతో హోరెత్తించారు. దీంతో ప్రశ్నోత్తరాలు ముందుకు కొనసాగని పరిస్థితి నెలకొంది. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలంటూ కాంగ్రెస్ సభ్యులు నినాదాలు చేశారు.
महाराष्ट्र में लोकतंत्र की हत्या हुई : श्री @RahulGandhi pic.twitter.com/wJXGjZ9NsG
— Congress (@INCIndia) November 25, 2019
మరోవైపు పార్లమెంటు ఎదుట గాంధీ విగ్రహం దగ్గర సోనియాగాంధీ ఆందోళనకు దిగారు. ఈ ఆందోళనలో సోనియాతో పాటు పలువురు ఎంపీలు, కాంగ్రెస్ నేతలు పాల్గొన్నారు. ఇక మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన ఎత్తివేయడంపై రాజ్యసభలోనూ ప్రతిపక్ష సభ్యులు గందరగోళం సష్టించారు. దీంతో రాజ్యసభ ఛైర్మన్ వెంకయ్యనాయుడు సభను మధ్యాహ్నం రెండు గంటల వరకు వాయిదా వేశారు.