అమరావతి: రాజకీయ లబ్దికోసం ఎంతకైనా దిగజారే వ్యక్తి వైఎస్ జగన్ అనడానికి ఇంతకన్నా పెద్ద ఉదాహరణ అవసరం లేదని టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ నారా లోకేష్ వ్యాఖ్యానించారు. జగన్మోహనరెడ్డి గతంలో, నిన్న అసెంబ్లీలో రాజధాని గురించి మాట్లాడిన మాటల వీడియోను లోకేష్ ట్విట్టర్లో పోస్టు చేస్తూ విమర్శలు గుప్పించారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రాజధానిపై ఒక మాట, అధికారంలోకి వచ్చిన తరువాత మరొక మాట మాట్లాడారనీ, ఎంతైనా మాట మార్చే, మడమ తిప్పే వంశం కదా అంటూ లోకేష్ విమర్శించారు.
previous post
next post