కేరళ: శబరిమలలో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అయ్యప్పను దర్శించుకునేందుకు వచ్చిన బిందు అమ్మాని అనే మహిళపై ఆందోళనకారులు కారంపొడితో దాడి చేశారు. ఎర్నాకుళం సిటీ పోలీస్ కమీషనర్ ఆఫీసు ఎదుట మంగళవారం ఉదయం ఈ ఘటన జరిగింది. సామాజిక కార్యకర్త తృప్తీ దేశాయ్తో బిందు శబరిమల వెళ్లే ప్రయత్నం చేశారు. అయితే భద్రత కల్పించాలంటూ వాళ్లు పోలీసు కమీషనర్ ఆఫీసుకు వచ్చారు. ఆ సమయంలో బిందుపై కొందరు కారంపొడి, పెప్పర్తో దాడి చేశారు. బిందు కారు దిగగానే ఓ అయ్యప్ప భక్తుడు.. ఆమెపై పెప్పర్ స్ప్రేతో దాడికి పాల్పడ్డాడు. విషయం తెలుసుకున్న పోలీసులు, అక్కడకు చేరుకునే సమయానికే బిందు ఊపిరి తీసుకోలేక అనారోగ్యానికి గురైంది. దీంతో బిందును ఆస్పత్రికి తరలించారు.
Man from #sabarimala devotee group uses pepper spray against Bindhu ,who was planning to go to #sabarimalatemple along with women activist #TruptiDesai,incident happened outside the Kochi Commissioner office!
They are strong about going to temple and protests are on already! pic.twitter.com/0hbXIUGyv3
— Sanjeevee sadagopan (@sanjusadagopan) November 26, 2019
Kerala: Bindu Ammini, one of the two women who first entered the #Sabarimala temple in January this year, says, "a man sprayed chilli and pepper at my face,"outside Ernakulam city police commissioner's office today morning. pic.twitter.com/lt2M58264k
— ANI (@ANI) November 26, 2019
మరోవైపు ఎలాగైనా అయ్యప్ప స్వామిని దర్శించుకుంటానని మహిళా హక్కుల కార్యకర్త తృప్తీ దేశాయ్ స్పష్టం చేశారు. ఇవాళ రాజ్యాంగ దినోత్సవం అని, ఈ సందర్భంగా తాము శబరిమల అయ్యప్పస్వామిని దర్శించుకుంటామని తెలిపింది. రాష్ట్ర ప్రభుత్వం, పోలీసులు కానీ తమను అడ్డుకోలేరన్నారు. తమకు భద్రత ఇచ్చినా, ఇవ్వకపోయినా తాము మాత్రం ఆలయానికి వెళ్తామని తేల్చి చెప్పారు.
ఇదిఇలా ఉంటే మహిళలు వస్తే రక్షణ కల్పించలేమని ఇప్పటికే కేరళ సర్కారు తేల్చి చెప్పింది. కోర్టు ఆదేశాలు ఉంటే తప్ప మహిళలకు భద్రత కల్పింలేమని కేరళ ప్రభుత్వం ప్రకటించింది. 41 రోజుల మండల దీక్షల కోసం నవంబర్ 16న శబరిమల ఆలయ తలుపులను అర్చకులు తెరిచారు. శబరిమల ఆలయంలోకి మహిళల ప్రవేశంపై గతంలో ఇచ్చిన తీర్పును సమీక్షించాలని కోరుతూ దాఖలైన పలు పిటిషన్లను సుప్రీంకోర్టు ఇటీవల విస్తృత రాజ్యాంగ ధర్మాసనానికి బదిలీ చేసింది. మహిళలకు ప్రవేశం కల్పిస్తూ గతేడాది సెప్టెంబర్ 28న ఇచ్చిన తీర్పుపై స్టే విధించేందుకు కూడా నిరాకరించిన సంగతి తెలిసిందే.