(న్యూస్ ఆర్బిట్ డెస్క్)
మెట్రోను నేటి యువత హాట్ స్పాట్గా మారుస్తున్నాయి. ఢిల్లీ మెట్రో రైలులో ఓ ప్రేమ జంట రెచ్చిపోయింది. తోటి ప్రయాణికులు చూస్తున్నారనే జ్ఞానం లేకుండా కౌగిలింతలు, ముద్దులతో రోమాన్స్లో మునిగితేలారు. సీసీ కెమెరాలు ఉంటాయని తెలిసినా..వీరు పబ్లిక్గా రెచ్చిపోతుండడంతో తోటి ప్రయాణీకులు షాక్ కలిగిస్తోంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఢిల్లీ మెట్రో రైల్లో పట్టపగలే సదరు ప్రేమ జంట రోమాన్స్లో మునిగిపోయారు. అందరి ముందే ముద్దులు పెట్టుకుంటూ లోకాన్ని మరిచారు. తోటి ప్రయాణికులకు ఎంతో ఇబ్బందిని కలిగించారు. ఇద్దరి భాగోతాన్ని ఓ ప్రయాణికుడు రహస్యంగా చిత్రీకరించాడు. దానిని సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో ఆ వీడియో వైరల్ అయ్యింది. దీనిపై స్పందించిన ఢిల్లీ మెట్రో రైల్ అధికారులు.. ఆ జంటను గుర్తించి చర్యలు తీసుకుంటామని తెలిపారు.
https://youtu.be/ZEKz6Tc29c8
కొన్ని నెలల క్రితం హైదరాబాద్ మెట్రో స్టేషన్ లిఫ్ట్లో ప్రేమ జంటలు రెచ్చిపోయి రొమాన్స్ చేసుకున్న సంగతి తెలిసిందే. లిఫ్ట్ సీసీటీవీలో రికార్డు అయిన ఆ వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి. మెట్రోలో ప్రతి రోజు లక్షలాది మంది ప్రయాణిస్తుంటారు. అయితే, కొంత మంది ప్రేమికులు చేసే చేష్టల వల్ల తోటి ప్రయాణీకులు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు.