హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ కాబోయే ముఖ్యమంత్రి, వైసిపి నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి శనివారం ప్రగతిభవన్లో తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ను కలిసి 30వ తేదీన విజయవాడలో జరిగే తన ప్రమణస్వీకారోత్సవానికి అతిధిగా రావాలని ఆహ్వానించారు.
ప్రత్యేక విమానంలో హైదరాబాద్ చేరుకున్న జగన్ నేరుగా రాజభవన్ వెళ్లి గవర్నర్ నరసింహన్ను కలిశారు. ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు మెజారిటీ పక్షం లెజిస్లేచర్ పార్టీ నాయకుడిగా తనను ఆహ్వనించాలని ఆయనను కోరారు.
అనంతరం జగన్ సతీసమేతంగా ప్రగతి భవన్ వెళ్లారు. కెసిఆర్ జగన్కు ఎంత ప్రాధాన్యత ఇస్తారో అక్కడ జగన్కు దొరికిన స్వాగతం లోనే తెలిసిపోయింది. తెలంగాణ ముఖ్యమంత్రి బయట పోర్టికోలో జగన్ కారు దగ్గరకు వచ్చి పుష్పగుచ్ఛం ఇచ్చి ఆత్మీయంగా ఆలింగనం చేసుకున్నారు.
లోపలకు వెళ్లిన తర్వాత కెసిఆర్ కుమారుడు కెటిఆర్ జగన్ను ఆప్యాయంగా కౌగలించుకున్నారు. స్పీకర్ పోచారం శ్రీనివాస రెడ్డి, టిఆర్ఎస్ నాయకులు కేశవరావు, మొహమూద్ ఆలీ, తలసాని శ్రీనివాస యాదవ్, ఇంద్రకరణ్ రెడ్డి కెసిఆర్ వెంట ఉన్నారు. ప్రగతి భవన్ లోపల కెసిఆర్ సతీమణి, కెటిఆర్ సతీమణి జగన్ దంపతులను పలకరించారు.
జగన్ రాక సందర్భంగా హైదరాబాద్లో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. జగన్ను చూసేందుకు అభిమానులు పెద్ద సంఖ్యలో రాజభవన్