విజయవాడ: అమరావతి రైతుల ఆందోళన ఉద్ధృతమవుతున్న నేపథ్యంలో పోలీసులు కఠిన ఆంక్షలు విధిస్తున్నారు. విజయవాడలో 144 సెక్షన్ విధించారు. నిన్నటి నుంచే నిషేధాజ్ఞలు అమల్లో ఉన్నట్టు పోలీసులు వెల్లడించారు. ఎలాంటి ర్యాలీలు, ప్రదర్శనలు, నిరసనలకు అనుమతి లేదని తేల్చి చెప్పారు. అమరావతి పరిరక్షణ సమితి చేసిన ఆందోళనల కారణంగా శాంతి భద్రతలకు భంగం కలిగిందని, ట్రాఫిక్ కు అంతరాయం కలిగినట్టు పోలీసులు చెప్పారు. పెళ్లిళ్లకు, శుభ కార్యక్రమాలకు కిరాయికి ఇవ్వాల్సిన ఫంక్షన్ హాలును నిరసనలు చేసుకునేందుకు ఇచ్చారని పేర్కొన్నారు. ఆ ఫంక్షన్ హాల్ కు అనుమతి రద్దు చేసే దిశగా చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు. విజయవాడలో నిబంధనలు పాటించని వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని విజయవాడ పటమట పోలీసులు ప్రకటించారు.
previous post
next post
Anchor Shyamala: యాంకర్ శ్యామలని చెప్పుతో కొట్టాలి.. శ్యామల పై నటుడు ఫైర్..!